News April 24, 2024
ఆదిలాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ADB జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్ ద్వారా సీఎం జన జాతర సభకు చేరుకోగా కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
Similar News
News July 10, 2025
ADB: ఆవు మృతితో ఆ ఊరంతా కన్నీళ్లు

బజార్హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయానికి చెందిన ఆవు మృతి చెందింది. 20 ఏళ్ల క్రితం సబ్బిడి పుష్పలత, నందు కుమార్ కుటుంబ సభ్యులు ఆలయానికి అవును విరాళంగా అందించగా, 16 దూడెలకు జన్మనిచ్చింది. రెండు దశాబ్దాలుగా ఆలయంలో దూప, దీప, నైవేద్యాలకు ఆదాయాన్ని సమకూర్చిన ఆవు కన్నుమూయడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్థులంతా కలిసి డప్పు వాయిద్యాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
News July 10, 2025
రుయ్యాడి పీర్ల బంగ్లా ఆదాయం ఎంతంటే..?

తలమడుగు మండలం రుయ్యాడి హస్సేన్, హుస్సేన్ దేవస్థానంలో సవార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, హుండీ లెక్కింపును బుధవారం చేపట్టారు. దేవస్థాన కమిటీ, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో లెక్కింపు కొనసాగింది. నగదు రూపంలో రూ.14 లక్షలు,10 తులాల బంగారం, 1.25 కేజీల వెండి వచ్చినట్లు దేవస్థాన కమిటీ తెలిపింది.
News July 10, 2025
ADB: నకిలీ పత్రాలతో భూ మాఫియా.. ముఠా అరెస్టు

నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ల అమ్మకం పేరుతో రూ.23 లక్షలు మోసం చేసిన ఘటనలో ఆరుగురిపై ADB రూరల్ PSలో కేసు నమోదైంది. నిందితులను రిమాండ్కు తరలించినట్లు DSP జీవన్రెడ్డి తెలిపారు. గుగులోత్ బాపురావు(ప్రభుత్వ ఉపాధ్యాయుడు), అతడి భార్య అంబికా, దాసరి జ్యోతి, గొడ్డెంల శ్రీనివాస్, పాలెపు శ్రీనివాస్, మాల్లేపల్లి భూమన్నతో కలిసి, నకిలీ పత్రాలు సృష్టించి భూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.