News December 25, 2025
ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే.!

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే పలు ప్రయోజనాలున్నాయి. ‘రాత్రి నిద్రలో శరీరం నీటిని కోల్పోతుంది. కాబట్టి వాటర్ తాగడం ద్వారా శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇది అలసట, తలనొప్పి తగ్గించి శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగై మలబద్దకం ఉన్నవారికి సహాయపడుతుంది. మెటబాలిజం 20-30% పెరిగి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది’ అని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News December 25, 2025
బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. రాజ్బరి జిల్లాలో 29 ఏళ్ల యువకుడు అమృత్ మండల్ను కొట్టి చంపారు. బుధవారం రాత్రి 11 గం.కు రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి దారుణంగా దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అమృత్ దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఈ హింసకు తెగబడ్డారు. కాగా ఇటీవల <<18624742>>దీపూ చంద్రదాస్<<>> అనే హిందూ యువకుడిని కొందరు కొట్టి చంపి, తగలబెట్టిన విషయం తెలిసిందే.
News December 25, 2025
‘అతను అంతమైపోవాలి’.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు

రష్యాతో యుద్ధంపై విసిగిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ క్రిస్మస్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అందరిదీ ఒకే కోరిక.. అతను అంతమైపోవాలి’ అంటూ పరోక్షంగా పుతిన్ మరణాన్ని కోరుకున్నారు. రష్యా వెనక్కి తగ్గితే తూర్పు ఉక్రెయిన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని జెలెన్స్కీ అన్నారు. ఆ ప్రాంతం అంతర్జాతీయ దళాల పర్యవేక్షణలో ఉండాలని కోరారు. ఏదైనా పీస్ డీల్ వస్తే ప్రజాభిప్రాయం తీసుకుంటానన్నారు.
News December 25, 2025
WPL: రేపు సాయంత్రం 6 గంటలకు టికెట్లు విడుదల

ఉమెన్ ప్రీమియర్ లీగ్(WPL)-2026 మ్యాచ్ల టికెట్లు రేపు సా.6 గంటలనుంచి అందుబాటులోకి రానున్నాయి. జనవరి 9న లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. నవీ ముంబై, వడోదరా వేదికల్లో ఈ సీజన్ మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 5 జట్లు పాల్గొననుండగా ఎలిమినేటర్, ఫైనల్తో కలుపుకొని 22 మ్యాచులు ఉన్నాయి. ఫిబ్రవరి 5న ఫైనల్ జరగనుంది. వెబ్సైట్: https://www.wplt20.com/.


