News December 25, 2025

1.07 లక్షల మందికి స్కాలర్‌షిప్

image

AP: రాష్ట్రంలోని కేజీబీవీల్లో చదువుకుంటున్న బాలికల స్కాలర్‌షిప్‌ల కోసం సమగ్రశిక్ష రూ.10.70 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను రూ.1,000 చొప్పున విద్యార్థినుల పేరెంట్స్ ఖాతాల్లో జమ చేసింది. కేజీబీవీల్లో 1.07 లక్షల మంది బాలికలు చదువుకుంటున్నారు. నిధుల విడుదలతో వారందరికీ ఊరట కలగనుంది.

Similar News

News January 1, 2026

UPలో BJPకి దడపుట్టిస్తున్న SIR

image

SIR ప్రక్రియ UPలో BJPకి సవాల్‌గా మారింది. రద్దయ్యే 18.7% ఓట్లలో ఆ పార్టీకి పట్టున్న లక్నో, ఘజియాబాద్, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్‌‌ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. SIR డ్రాఫ్ట్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12.55 CR ఓట్లుంటాయని అంచనా. అయితే 25CR రాష్ట్ర జనాభాలో 65% అంటే 16 CR ఓటర్లుండాలని, మిగతా 4 CR మంది జాబితాలో చేరని వారేనని BJP భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది.

News January 1, 2026

మినుములో మారుకా మచ్చల పురుగు వల్ల కలిగే నష్టం

image

మారుకా మచ్చల పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో మినుము పంటను ఆశించి ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు వాటిని దగ్గరకు జేర్చి గూడుగా కట్టి, కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటంవలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ తెగులును సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోతే తీవ్ర నష్టం తప్పదు.

News January 1, 2026

భారీ జీతంతో 79 పోస్టులకు నోటిఫికేషన్

image

TG: కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో 79 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 44 అసోసియేట్ ప్రొఫెసర్, 17 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రిజిస్ట్రార్ భగవాన్ తెలిపారు. ఈ నెల 31 సా.4 గంటల వరకు యూనివర్సిటీలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రొఫెసర్‌కు రూ.1.44L-2.18L, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.31L-2.17L జీతంగా పేర్కొంది. అర్హత, ఇతర పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.