News December 25, 2025

నంద్యాల జిల్లాలోనే అతి పురాతన, పెద్ద చర్చి ఇదే..!

image

1881లో నంద్యాలకు వచ్చిన మొదటి మిషనరీలు ఆర్థర్ ఇన్మాన్, ఆల్ఫ్రెడ్ బ్రిటన్ 1905లో నంద్యాలలో హోలీ క్రాస్ చర్చిని నిర్మించారు. ఈ చర్చి నంద్యాల జిల్లాలోనే అతిపెద్ద చర్చిగా కీర్తి పొందింది. 120 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ చర్చి చెక్కుచెదరలేదు. ఆ ప్రాంతానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

Similar News

News January 1, 2026

ఖమ్మం నగరంలో దారుణం… వృద్ధురాలి హత్య

image

ఖమ్మం బొక్కలగడ్డలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మోటే రాములమ్మను మరిది కొడుకు శేఖర్ ఇంటిముందు మిరపకాయల తొడిమలు తీస్తుండగా కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై కూడా నిందితుడు కత్తితో దాడి చేయగా, అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు నిందితుడు శేఖర్‌ను అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

News January 1, 2026

DPR లేని ప్రాజెక్టుకు రూ.27వేల కోట్లు చెల్లించారు: రేవంత్

image

TG: పార్టీని బతికించుకునేందుకు KCR మళ్లీ చంద్రబాబు పేరును, నీటి సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని CM రేవంత్ ఆరోపించారు. కృష్ణా జలాలపై మీడియాతో మాట్లాడారు. పాలమూరు-RR ప్రాజెక్టుకు KCR ఏడేళ్లు DPR సమర్పించలేదన్నారు. దీంతో పర్యావరణ అనుమతులు రాలేదని, అనుమతులు లేని ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ కొందరు కేసులు వేశారన్నారు. DPR లేని ప్రాజెక్టుకు కమీషన్ల కోసం KCR రూ.27వేల Cr చెల్లించారని విమర్శించారు.

News January 1, 2026

చిత్తూరు కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ

image

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను పలువురు అధికారులు గురువారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బొకేలు, పండ్లు అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో JC విద్యాధరి, డీఆర్వో మోహన్ కుమార్, మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎస్ఎస్పీఎ వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఐఅండ్ పీఆర్ అధికారి వేలాయుధం తదితరులు ఉన్నారు.