News December 25, 2025
సూర్యాపేట: ”ఆయన”ను పక్కకు పెడితే బెటర్

గ్రామాల్లో మహిళా సర్పంచుల పరిపాలన వ్యవహారాలు భర్తలే చూసుకున్న ఘటనలు గతంలో చూశాం. మహిళా ప్రతినిధులను కేవలం సంతకాలకే పరిమితం చేస్తూ, పురుషాధిపత్యం కొనసాగితే రిజర్వేషన్ల ఆశయం నీరుగారుతుందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, లేనిపక్షంలో అది “పెత్తనం ఆయనదే” అన్న చందంగా మారుతుందని వాదిస్తున్నారు.
Similar News
News December 27, 2025
పల్నాడు జిల్లాలో ఉపాధి హామీ పనులలో అక్రమాలు.!

ఉపాధి హామీ పథకం కూలీల కాకుండా అక్రమార్కులకు వరంగా మారింది. డ్వామా ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తుండగా, కోట్లల్లో అక్రమాలను గుర్తించిన రికవరీ చేయడం లేదు. సోషల్ ఆడిట్ పేరుతో అధికారులు కాలక్షేపం చేయడానికి పరిమితం అవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో సోషల్ యూనిట్ 790 పనులులో అక్రమాలు గుర్తించారు. రూ.2,11,94,590 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని నిర్ధారించారు. రూపాయి కూడా రికవరీ చేయలేదు.
News December 27, 2025
రేపు ట్రంప్తో జెలెన్ స్కీ భేటీ!

US అధ్యక్షుడు ట్రంప్తో రేపు ఫ్లోరిడాలో భేటీ కానున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం ముగింపు, శాంతి ఒప్పందంపై చర్చించనున్నట్లు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదించిన 20సూత్రాల ప్రణాళికలో 90% మేర ఏకాభిప్రాయం కుదిరిందని జెలెన్ స్కీ చెప్పారు. రేపటి భేటీలో ఉక్రెయిన్కు US ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. కొత్త ఏడాదికి ముందే కీలక పరిణామాలు సంభవించొచ్చని తెలిపారు.
News December 27, 2025
ఉమ్మడి KNRలో ‘ఎక్సైజ్’ అధికారుల ‘EXTRA దందా’..!

ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల ఓనర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి KNRలో 287 WINES ఉండగా రూ.7 కోట్ల టార్గెట్తో ఒక్కో షాప్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఇవే కాకుండా నెలకు రూ.15000లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారట. దీంతో కొందరు మద్యం వ్యాపారులు మామూళ్లు చెల్లిస్తుండగా మరి కొంతమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారట.


