News April 24, 2024
రెండో దశ ఎన్నికల్లో ధనవంతులు వీరే

కర్ణాటకలోని మాండ్య నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటరమణ గౌడ రూ.622 కోట్ల ఆస్తులతో రెండో దశ ఎన్నికల్లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ రూ.593 కోట్లు, యూపీలోని మథుర నుంచి బీజేపీ అభ్యర్థి హేమమాలిని రూ.278 కోట్లతో ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. రెండో దశ పోలింగ్ ఈ నెల 26న జరగనుంది. ఎన్నికల్లో 1,210 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Similar News
News February 15, 2026
IITల్లో అకాడమిక్ ఎక్స్ఛేంజ్.. వేరే క్యాంపస్కు వెళ్లి చదువుకునే ఛాన్స్

IITలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అకాడమిక్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. TOI కథనం ప్రకారం.. విద్యార్థులు ఒక సెమిస్టర్ పాటు ఇతర IIT క్యాంపస్లలో చదువుకోవచ్చు. అక్కడ సంపాదించిన క్రెడిట్లను వారి సొంత IIT గుర్తిస్తుంది. కేవలం ర్యాంకుకు పరిమితం కాకుండా విద్యార్థులకు నచ్చిన కోర్సులను ఇతర IITల్లో నేర్చుకునే స్వేచ్ఛను కల్పించడమే ఈ నిర్ణయం వెనక ఉద్దేశం.
News February 15, 2026
‘ఫుడ్ జిహాద్’ పేరుతో వేధిస్తారా.. ఒవైసీ ఆగ్రహం

TG: మేడారం జాతరలో కర్నూలుకు చెందిన చిరువ్యాపారి వలీని వేధించిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. వ్యూస్ కోసం పేద వ్యాపారిని అవమానించడం, మత రంగు పులిమి వేధించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కేవలం రూ.10కి కోవా బన్ను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని ‘ఫుడ్ జిహాద్’ పేరుతో భయభ్రాంతులకు గురిచేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
News February 15, 2026
ఘనవిజయం.. సూపర్-8లోకి వెస్టిండీస్, ఇంటికి నేపాల్

T20WC: నేపాల్పై వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత నేపాల్ 20 ఓవర్లలో 133/8 రన్స్ చేసింది. దీపేంద్ర సింగ్ ఒక్కడే 58 పరుగులతో రాణించారు. అనంతరం విండీస్ కేవలం 15.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ హోప్ (61*), హెట్మెయిర్ (46*) రాణించారు. ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్-C నుంచి సూపర్-8కి వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. అటు నేపాల్ ఎలిమినేట్ అయింది.


