News December 25, 2025
NEW YEAR: HYDలో సరికొత్తగా!

HYDలో న్యూ ఇయర్ వేడుకలు కేవలం పబ్లకే పరిమితం కాకుండా ‘ఓపెన్ టు ఆల్’ పద్ధతిలో సాగనున్నాయి. పర్యాటక శాఖ బాణసంచా కాలుష్యాన్ని అరికట్టేందుకు ట్యాంక్బండ్, చార్మినార్ వద్ద మెగా డ్రోన్ షోలను ప్లాన్ చేస్తోంది. హైడ్రా పునరుద్ధరించిన చెరువుల గట్లపై తొలిసారిగా లైవ్ మ్యూజిక్, ఫుడ్ స్టాల్స్తో వేడుకలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ట్రాఫిక్ చిక్కులు లేకుండా నగరం వెలుపల 3 భారీ కౌంట్డౌన్ ఈవెంట్లకు అనుమతించింది.
Similar News
News December 29, 2025
NMDC స్టీల్ ప్లాంట్లో 100 పోస్టులకు నోటిఫికేషన్

ఛత్తీస్గఢ్లోని NMDC స్టీల్ లిమిటెడ్ 100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు జనవరి 12, 13, 14, 15 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఐటీఐ(COPA, వెల్డర్, మెకానిక్, ఎలక్ట్రికల్)ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్సైట్: https://nmdcsteel.nmdc.co.in
News December 29, 2025
VJA: రైల్వే ఘటన.. మృతుడి వద్ద రూ. 5.80 లక్షలు

ఎలమంచిలిలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదంలో విజయవాడ వాసి చంద్రశేఖర్ సుందర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వద్ద ఉన్న బ్యాగులో రూ.5.80 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదంలో ఈ నగదులో కొన్ని నోట్లు పాక్షికంగా కాలిపోయాయి. సోమవారం ఉదయం రైల్వే పోలీసులు ఓ సంచిలో ఈ సొమ్మంతా ప్యాక్ చేసి స్వాధీనం చేసుకున్నారు.
News December 29, 2025
మంత్రి రాంప్రసాద్రెడ్డికి చంద్రబాబు ఫోన్

AP: <<18702293>>రాయచోటి<<>>ని జిల్లా కేంద్రంగా తొలగించడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాంప్రసాద్రెడ్డితో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ‘విధిలేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మీరు పోరాడుతున్నారు. ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేసే వీలులేకే ఈ పరిస్థితి వచ్చింది’ అని తెలిపారు. రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు CM హామీ ఇచ్చారు.


