News April 24, 2024

మల్లన్నను దర్శించుకున్న నారా చంద్రబాబు దంపతులు

image

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా సోమవారం శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన నారా చంద్రబాబు నాయుడు దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News December 25, 2025

ఆదోని మండల విభజనపై స్థానికుల నిరసన

image

​ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా 17 గ్రామాలతో ‘పెద్ద హరివాణం’ మండలాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త మండల కేంద్రం కర్ణాటక సరిహద్దులో ఉండటం వల్ల చాలా గ్రామాలకు 40 కిలోమీటర్ల దూరం అవుతుందని ఆందోళన, నిరసనలు చేపట్టారు. ఈ అభ్యంతరాలపై రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. ఈ నెల 28న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News December 24, 2025

కర్నూలు SP కీలక నిర్ణయం

image

కర్నూలు జిల్లాలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారి లొకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఉద్యోగాల మోసాలు, ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల కేసులను ఛేదించి రికవరీలను పెంచాలని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

News December 24, 2025

నేర నివారణే లక్ష్యంగా పనిచేయాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్

image

కర్నూలు జిల్లాలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారి లొకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఉద్యోగాల మోసాలు, ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల కేసులను ఛేదించి రికవరీలను పెంచాలని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.