News December 25, 2025

బిజినేపల్లి: ఆలయ అర్చకునిపై దాడి

image

బిజినేపల్లి మండలంలోని పాలెంలో అభయ ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడు ఖానాపురం సురేష్ శర్మపై అకారణంగా దాడి జరగింది. ఆలయ స్థలదాత రెడ్డి వెంకటేశ్వర రెడ్డి తనపై దాడి చేశారని అర్చకుడు ఆరోపిస్తూ ఆలయ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. అర్చకుడికి మద్దతుగా గ్రామ యువకులు తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Similar News

News December 26, 2025

NTR: సీఎం ఆదేశాలు బేఖాతరు.. DRCకి పాలకుల డుమ్మా!

image

NTR జిల్లా ప్రగతి, అభివృద్ధిపై శుక్రవారం విజయవాడలో మంత్రి సత్యకుమార్ DRC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగ్గయ్యపేట MLA శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు. MP కేశినేని, మిగతా MLAలు డుమ్మా కొట్టారు. నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి దోహదపడే ఈ సమావేశానికి నేతల గైర్హాజరుపై విమర్శలొస్తున్నాయి. DRCలో ప్రజాప్రతినిధులు తప్పక పాల్గొనాలని CM చంద్రబాబు ఇప్పటికే ఆదేశించినా నేతలు బేఖాతరు చేయడం గమనార్హం.

News December 26, 2025

విద్యార్థులు తప్పక వీక్షించాలి: తిరుపతి DEO

image

రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోందనితిరుపతి DEO కేవీన్ కుమార్ పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఆధునిక, వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇవి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందిస్తాయన్నారు. విద్యార్థులు తప్పక వీక్షించాలన్నారు.

News December 26, 2025

మేడారం మహా జాతరకు జంపన్నవాగు సిద్ధం..!

image

మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం జంపన్న వాగులో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేవతల దర్శనానికి ముందు భక్తులు వాగులో పవిత్ర స్నానాలు చేయనున్నారు. ఇందుకోసం రూ.5.50 కోట్లతో ఇసుకను చదును చేసి, 39 బావులను శుభ్రపరిచి పైపులు, మోటార్లు ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నెల 25 నాటికి పనులు పూర్తి చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.