News December 25, 2025

నిజామాబాద్: తెలంగాణ గోరక్ష సభ్యునిగా ధాత్రిక రమేష్

image

నిజామాబాదు జిల్లా కేంద్రానికి చెందిన ధాత్రిక రమేష్ తెలంగాణ ప్రాంత గోరక్ష విభాగం సభ్యులుగా నియమించినట్లు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ తెలిపారు. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో గోరక్ష అవగాహన కార్యక్రమాలతో పాటు గోఅధారిత వ్యవసాయం తదితర అంశాలపై యువత రైతుల్లో కార్యశాల నిర్వహించి చైతన్య పర్చడానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News December 29, 2025

నవీపేట్: అంగన్వాడి సెంటర్లో పేలిన కుక్కర్

image

నవీపేట్ మండలం రాంపూర్ గ్రామ అంగన్వాడీ సెంటర్లో సోమవారం కుక్కర్ పేలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని రెంజల్ 108 సిబ్బంది లక్ష్మణ్, నయీమ్ ప్రథమచికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పిల్లల కోసం కుక్కర్లో పప్పు ఉడికిస్తున్న సమయంలో అది పేలి సమీపంలోని ఉన్న చిన్నారులకు గాయాలయ్యాయి. వంట చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకొని పిల్లలను దూరంగా ఉంచాలని గ్రామస్థులు కోరారు.

News December 29, 2025

NZB: KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరు: MP

image

KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరని NZB ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సర్పంచుల అభినందన సభలో మాట్లాడారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి KCR అని అన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను KCR కుటుంబం నాశనం చేసిందన్నారు.

News December 29, 2025

NZB: KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరు: MP

image

KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరని NZB ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సర్పంచుల అభినందన సభలో మాట్లాడారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి KCR అని అన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను KCR కుటుంబం నాశనం చేసిందన్నారు.