News December 26, 2025

ప్లాస్టిక్ రహిత మేడారం సాధ్యం కదా..?

image

వనదేవతల చెంత ప్లాస్టిక్ వ్యర్ధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జాతర ముగిసిన తర్వాత మేడారంతో పాటు పరిసర గ్రామాలు కాలుష్య కాసారంగా మారుతున్నాయి. ప్లాస్టిక్ భూమిలో కలవక సారం కోల్పోతుండగా, వాటిని తిన్న పశువులు చనిపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్లాస్టిక్ రహిత జాతర కోసం కార్యాచరణ రూపొందించాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించి అడవి తల్లిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

Similar News

News January 1, 2026

UPలో BJPకి దడపుట్టిస్తున్న SIR

image

SIR ప్రక్రియ UPలో BJPకి సవాల్‌గా మారింది. రద్దయ్యే 18.7% ఓట్లలో ఆ పార్టీకి పట్టున్న లక్నో, ఘజియాబాద్, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్‌‌ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. SIR డ్రాఫ్ట్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12.55 CR ఓట్లుంటాయని అంచనా. అయితే 25CR రాష్ట్ర జనాభాలో 65% అంటే 16 CR ఓటర్లుండాలని, మిగతా 4 CR మంది జాబితాలో చేరని వారేనని BJP భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది.

News January 1, 2026

తిరుమలలో నేటి రాత్రి నుంచే FREE దర్శనం

image

లక్కీడిప్ టోకెన్లు ఉన్న భక్తులకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. సర్వ దర్శనం(టోకెన్లు లేకుండా ఫ్రీ ఎంట్రీ) నేటి రాత్రి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే TTD సర్వదర్శనం క్యూ లైన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆక్టోపస్ సర్కిల్ నుంచి లైన్ తీసుకోనున్నారు. రద్దీని బట్టి సాయంత్రం నుంచే టోకెన్లు లేని భక్తులను క్యూలోకి అనుమతించే అవకాశం ఉంది. CRO దగ్గర రూములు తీసుకోవచ్చు.

News January 1, 2026

మినుములో మారుకా మచ్చల పురుగు వల్ల కలిగే నష్టం

image

మారుకా మచ్చల పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో మినుము పంటను ఆశించి ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు వాటిని దగ్గరకు జేర్చి గూడుగా కట్టి, కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటంవలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ తెగులును సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోతే తీవ్ర నష్టం తప్పదు.