News December 26, 2025
ఈ నెల 27న విజయవాడ రానున్న బోయపాటి

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 చిత్రాన్ని ప్రేక్షకులతో కలసి వీక్షించేందుకు ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను విజయవాడ రానున్నారు. ఈ నెల 27న రాత్రి 9 గంటలకి విజయవాడ శైలజ థియేటర్లో బోయపాటి.. అఖండ-2 వీక్షిస్తారని తాజాగా సమాచారం వెలువడింది. అనంతరం 28న బోయపాటి గుంటూరు, ఒంగోలులో సైతం థియేటర్లలో ఆడియన్స్తో కలసి అఖండ మూవీ చూస్తారని తెలుస్తోంది.
Similar News
News December 28, 2025
జెప్టో.. రూ.11 వేల కోట్లకు IPO

క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి డాక్యుమెంట్లు సమర్పించింది. ఈ IPO ద్వారా సుమారు రూ.11వేల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2026లో మార్కెట్లో లిస్టింగ్ కావాలని భావిస్తోంది. కాగా 2020లో అదిత్, కైవల్య ఈ స్టార్టప్ను ప్రారంభించారు. ప్రస్తుతం దీని విలువ 7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే దీని పోటీదారులైన స్విగ్గీ ఇన్స్టామార్ట్, బ్లింకిట్ (జొమాటో) లిస్ట్ అయ్యాయి.
News December 28, 2025
సంగారెడ్డి: కల్వర్టు గుంతలో పడి ముగ్గురి మృతి

నారాయణఖేడ్ పట్టణ శివారులో డబుల్ బెడ్ రూముల వద్ద నిజాంపేట్-బీదర్ 161బి హైవేపై నిర్మిస్తున్న కల్వర్టు గుంతలో పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఖేడ్ మండలం నర్సాపూర్కి చెందిన అవుటి నర్సింలు (27), జిన్న మల్లేష్ (24), జిన్న మహేశ్ (23)గా గుర్తించారు. వీరు ఒకే బైకుపై ఖేడ్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా అదుపు తప్పి కల్వర్టు గుంతలో పడి మృతి చెందారు.
News December 28, 2025
కేజీ చికెన్ రూ.300.. మాంసం ప్రియులకు షాక్

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.300గా ఉంది. విజయవాడలో కేజీ రూ.280, వరంగల్లో రూ.290, గుంటూరులో రూ.260, శ్రీకాకుళంలో రూ.305కి విక్రయిస్తున్నారు. గత వారం HYDలో కేజీ రూ.250 ఉండగా ఇప్పుడు రూ.50 వరకు పెరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అటు కోడిగుడ్డు ధర రూ.8గా ఉంది.


