News December 26, 2025
మానుకోటకు పొంగులేటి, KTR

మానుకోటలో పొంగులేటి, KTR పర్యటన ఒకే రోజు ఉండటంతో ఆసక్తి నెలకొంది. పట్టణ కేంద్రంలో దివంగత మంత్రి నూకల రామచంద్రరెడ్డి విగ్రహావిష్కరణ రేపు జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గోనున్నారు. అదే పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో BRS మద్దతుతో గెలిచిన సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి KTR రానున్నారు. దీంతో కాంగ్రెస్, BRS శ్రేణులు వారికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
Similar News
News January 14, 2026
పాలిటెక్నిక్లో కొత్త కోర్సులు!

TG: విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలిటెక్నిక్లో 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9 కొత్త కోర్సులు రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త సిలబస్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై AICTE అనుమతుల కోసం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఢిల్లీకి వెళ్లారు. వీటితో పాటు మొదటి సంవత్సరంలో సెమిస్టర్కు బదులుగా వార్షిక పరీక్ష విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News January 14, 2026
పాలిటెక్నిక్లో కొత్త కోర్సులు ఇవే..

1)సెమీకండక్టర్స్ టెక్నాలజీ,
2)సివిల్ ఇంజినీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యుయేషన్
3)ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇంజినీరింగ్
4)ల్యాండ్ స్కేప్ డిజైన్, 5)బయోటెక్నాలజీ
6)కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్
7)సివిల్ ఇంజినీరింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్
8)ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్
9)అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ
News January 14, 2026
రేపు భోగి.. ఏం చేస్తారంటే?

తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగలో తొలి రోజును భోగిగా పిలుస్తారు. ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పనికి రాని, పాత చెక్కవస్తువులతో భోగి మంటలు వేస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేయడంతో పాటు ఇంటిని శుద్ధి చేసి పిండి వంటలు చేసుకొని తింటారు. దానం చేస్తారు. సాయంత్రం చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. కొందరు తమ ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు.


