News December 26, 2025
శ్రీకాకుళం జిల్లా 104లో ఉద్యోగాలు

ప్రభుత్వం భవ్య ద్వారా నిర్వహిస్తున్న 104 చంద్రన్న సంచార చికిత్సలో భాగంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని శ్రీకాకుళం జిల్లా అధికారి నరసింహమూర్తి శుక్రవారం తెలిపారు. విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్లో ఈనెల 27, 28 తేదీల్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News December 27, 2025
శ్రీకాకుళం ఎంపీకి ప్రతిష్ఠాత్మక గౌరవం

భారతదేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఔట్స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డుకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరును శ్రీకాకుళం జేసీఐ సన్ రైజర్స్ ప్రతిపాదించింది. జేసీఐ బృంద సభ్యులు జేసి ప్రవీణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. అవార్డును భారతదేశంలో ఉన్నత స్థానంలో ఉండి, తమ తమ రంగాలలో విశేషమైన సేవలు, కృషి చేసి 40 సంవత్సరాలలోపు ఉన్న యువ నాయకులకు మాత్రమే ప్రదానం చేయబడుతుందన్నారు.
News December 27, 2025
శ్రీకాకుళం: B.tech చదవి నకిలీ డాక్టర్ అవతారం

విశాఖ KGHలో డాక్టర్గా నమ్మించి కిడ్నీ బాధితుడి వద్ద లక్ష రూపాయలు వసూలు చేసిన <<18678274>>నిందితుడిని<<>> వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళానికి చెందిన బాధితుడు తన కుమారుడి చికిత్స కోసం ప్రకటన ఇవ్వగా, నిందితుడు జ్యోతి శివశ్రీ ‘డాక్టర్ నరసింహం’గా పరిచయం చేసుకుని మోసగించాడు. బి.టెక్ చదివి కారు డ్రైవర్గా పనిచేస్తున్న ఇతనిపై గతంలోనూ పలు దొంగతనాల కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
News December 27, 2025
శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్లలో 2,398 మంది మృతి

శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్ల నుంచి రోడ్డు ప్రమాదాలలో 2,398 మంది మృతి చెందారు. 2023 – 810, 2024- 889, 2025లో ఇప్పటి వరకు 699 మంది చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం 2026 మొదటి నెలను రోడ్డు భద్రత మాసంగా ప్రకటించింది. ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించకపోవడంగా గుర్తించారు. వీటిని అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.


