News December 26, 2025
త్రీమెన్ కమిటీలో రైతులుండాల్సిందే: రైతు JAC

AP: మంత్రులు పెమ్మసాని, నారాయణ, MLA శ్రవణ్లతో కూడిన కమిటీ ఏ ఒక్క అంశాన్నీ పరిష్కరించలేదని అమరావతి రైతు JAC నేతలు విమర్శించారు. కమిటీ ఏ సమాచారమూ ఇవ్వడం లేదన్నారు. పూలింగ్కు ఇవ్వని భూముల్లో కాకుండా వేరే చోట ప్లాట్లు ఇవ్వాలని, గ్రామాల పరిధిలోనే శ్మశానాలుండాలని కోరారు. R5 జోన్ సమస్య మార్చిలోగా పరిష్కరించాలన్నారు. కమిటీలో రైతులనూ చేర్చాలని విన్నవించారు. నిన్న జరిగిన JAC భేటీలో పలు తీర్మానాలు చేశారు.
Similar News
News January 3, 2026
గంజాయి తీసుకుంటూ దొరికిన BJP MLA కుమారుడు

TG: ఈగల్ టీమ్ తనిఖీల్లో BJP ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. నానక్రామ్గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దొరికారు. తనిఖీల సమయంలో గంజాయి తీసుకుంటూ చిక్కిన ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఆయనను ఈగల్ టీమ్ డీఅడిక్షన్ సెంటర్కు తరలించింది.
News January 3, 2026
మీడియా ముందుకు దేవా

TG: రాష్ట్రంలో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయినట్లు DGP శివధర్ రెడ్డి పేర్కొన్నారు. కీలక నేతలు బర్సే దేవా, కంకనాల రాజిరెడ్డి, రేమలతో పాటు మరో 17మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. వారు 48 తుపాకులు, 93 మ్యాగ్జిన్లు, 2206 బుల్లెట్స్, రూ.20,30,000 నగదు అప్పగించినట్లు వెల్లడించారు. దేవాపై రూ.75లక్షల రివార్డ్ ఉంది. ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా 15 ఏళ్లు పనిచేశారు.
News January 3, 2026
IIIT డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో ఉద్యోగాలు

<


