News December 26, 2025
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం HYD నుంచి బయలుదేరి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా దివంగత మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం డోర్నకల్ మండలంలో పర్యటించి, నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్ మినీ ట్యాంక్బండ్ను ప్రారంభించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Similar News
News December 30, 2025
జనవరి 3న కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన ఖరారైంది. జనవరి 3న ఉ.9:30కి హెలికాప్టర్ ద్వారా HYD నుంచి కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానాలు నిధులతో నిర్మిస్తున్న 100 గదుల వసతి గృహాల శంకుస్థాపనలో పాల్గొని మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్కు తిరిగి వెళ్తారు.
News December 30, 2025
జనవరి 3న కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన ఖరారైంది. జనవరి 3న ఉ.9:30కి హెలికాప్టర్ ద్వారా HYD నుంచి కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానాలు నిధులతో నిర్మిస్తున్న 100 గదుల వసతి గృహాల శంకుస్థాపనలో పాల్గొని మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్కు తిరిగి వెళ్తారు.
News December 30, 2025
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కు పాదం మోపాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా సోమవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వాగులు, ఇతర వనరుల్లో లభ్యమయ్యే ఇసుకను కేవలం 500 మీటర్ల పరిధిలోని గ్రామస్తులు మాత్రమే వినియోగించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందన్న విషయాన్ని గమనించాలన్నారు.


