News December 26, 2025

పీఆర్సీ ప్రకటించకపోతే మారో ఉద్యమం: UTF

image

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని, లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023 జూలై 1 నుంచి పీఆర్సీని వర్తింపజేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 28, 29న జరిగే మహాసభలను ఉపాధ్యాయులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News December 28, 2025

భారత్ ఖాతాలో మరో విజయం

image

శ్రీలంక ఉమెన్స్‌తో జరుగుతున్న 5 T20ల సిరీస్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా జరిగిన 4వ T20లో IND 30 రన్స్ తేడాతో గెలిచింది. 222 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన SL 20 ఓవర్లలో 191/6 రన్స్‌కే పరిమితమైంది. ఓపెనర్లు ఆటపట్టు(52), పెరెరా(33) దూకుడుగా ఆడినా వారు ఔటయ్యాక రన్‌రేట్ పెరిగిపోవడంతో ఓటమిపాలైంది. IND బౌలర్లలో అరుంధతి, వైష్ణవి చెరో 2 వికెట్లు తీశారు. సిరీస్‌లో IND 4-0 లీడ్ సాధించింది.

News December 28, 2025

బ్యాడ్మింటన్‌లో గోల్డ్ సాధించిన చరిష్మ.. CBN, లోకేశ్ అభినందనలు

image

AP: విజయవాడలో జరిగిన 87వ యోనెక్స్ సన్‌రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2025 ఉమెన్స్ సింగిల్స్‌లో రాష్ట్రానికి చెందిన సూర్య చరిష్మ తమిరి గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే ఇంటర్ స్టేట్ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్ షిప్‌లో ఆంధ్రా జట్టు సిల్వర్ గెలిచింది. తొలి గోల్డ్ మెడల్ సాధించిన చరిష్మ, సిల్వర్ గెలిచిన టీమ్‌ను CM చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ అభినందించారు.

News December 28, 2025

29న పుట్టపర్తిలో రెవెన్యూ క్లినిక్ ప్రారంభం

image

పుట్టపర్తిలో ఈనెల 29న ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సులభంగా, వేగవంతంగా రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యమన్నారు. అడంగల్ సవరణలు, మ్యుటేషన్, 1బి, పట్టాదారు పాస్‌పుస్తకాలు, అసైన్‌మెంట్, 22ఏ, భూ సమస్యల పరిష్కారానికి డివిజన్ వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతులకు జనవరి 2 నుంచి 9 వరకు కొత్త పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు.