News December 26, 2025

మేడారం మహా జాతరకు జంపన్నవాగు సిద్ధం..!

image

మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం జంపన్న వాగులో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేవతల దర్శనానికి ముందు భక్తులు వాగులో పవిత్ర స్నానాలు చేయనున్నారు. ఇందుకోసం రూ.5.50 కోట్లతో ఇసుకను చదును చేసి, 39 బావులను శుభ్రపరిచి పైపులు, మోటార్లు ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నెల 25 నాటికి పనులు పూర్తి చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Similar News

News January 2, 2026

నల్గొండ: మున్సిపాలిటీల్లో పెరిగిన 31,902 మంది ఓటర్లు

image

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020లో (నకిరేకల్ మినహా) 18 మున్సిపాలిటీల్లో 6,33,683 మంది ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదా జాబితా ప్రకారం ఆ సంఖ్య 6,65,585కు చేరింది. నాలుగేళ్లలో కొత్తగా 31,902 మంది ఓటర్లు పెరిగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల జాబితా ఆధారంగా ఈ ముసాయిదాను సిద్ధం చేశారు. విశేషమేమిటంటే, ఓటర్ల నమోదులో పురుషుల కంటే మహిళలే ఆధిక్యంలో ఉండటం.

News January 2, 2026

కృష్ణా: రైతులకు రాజముద్రతో కొత్త పాస్‌పుస్తకాలు

image

కృష్ణా జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 176 గ్రామాల రైతులకు రాజముద్ర కలిగిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని 21 మండలాల్లోని లబ్ధిదారులకు ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభలలో వీటిని అందజేయనున్నారు. ఇప్పటికే E-KYC ప్రక్రియ ముగియగా, బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయిన వారికి నేరుగా పట్టాలు అందనున్నాయి.

News January 2, 2026

నల్గొండ: రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు!

image

ఉమ్మడి జిల్లాలో డిసెంబర్ మాసంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. గతనెలలోనే ఒకపక్క కొత్త మద్యం షాపులు తెరుచుకోవడం, మరో పక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు, థర్టీ ఫస్ట్ వేడుకలు జరగడంతో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. దీంతో ఒక్క నెలలోనే నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 245 మద్యం షాపుల ద్వారా రూ.452 కోట్ల వ్యాపారం సాగింది. గతేడాది కంటే ఈ డిసెంబర్ నెలలోనే రూ.167 కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది.