News December 26, 2025

బిల్లు కన్నా ఎక్కువ తీసుకుంటే చర్యలు: జేసీ

image

వంట గ్యాస్ డెలివరీ సమయంలో ఛార్జీల పేరుతో వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ హెచ్చరించారు. శుక్రవారం మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ, రేషన్ సరుకుల పంపిణీపై అధికారులతో సమీక్షించారు. వంట గ్యాస్ అందించే డెలివరీ బాయ్స్ ప్రతి వినియోగదారునితో మర్యాదగా ప్రవర్తించేలా డీలర్లు పర్యవేక్షించాలని, రసీదు కంటే ఒక్కరూపాయి డిమాండ్ చేసినా, వసూలు చేసినా చర్యలు తప్పవన్నారు.

Similar News

News December 30, 2025

రెండు పరీక్షలు రీషెడ్యూల్ చేసిన CBSE

image

అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్‌తో 10, 12వ తరగతుల రెండు పరీక్షలు రీ షెడ్యూల్ చేస్తున్నట్లు CBSE తెలిపింది. 2026 MAR 3న జరగాల్సిన 10వ తరగతి లాంగ్వేజెస్/ఎలక్టివ్ పేపర్ ఎగ్జామ్ MAR 11న ఉంటుంది. ఇక 12వ తరగతి విద్యార్థులకు MAR3న షెడ్యూల్ అయిన లీగల్ స్టడీస్ ఎగ్జామ్ తేదీ APR 10కి మార్చినట్లు తాజా ప్రకటనలో వెల్లడించింది. మిగతావి పాత షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని CBSE పేర్కొంది.
Share It

News December 30, 2025

భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 11 మంది అరెస్ట్

image

అస్సాం పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న 11 మంది ఉగ్రవాదులను అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో బార్పేటా, చిరాంగ్, దరాంగ్ జిల్లాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. భారీ దాడులకు వీరు ప్లాన్ వేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వారి నుంచి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.

News December 30, 2025

చిత్తూరు జిల్లా పరిపాలన పునర్వ్యవస్థీకరణ

image

పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మార్పు 2025 డిసెంబర్‌ 31 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు గెజిట్‌లో ఉత్తర్వులు ప్రచురించనున్నారు. ఈ మార్పుతో బంగారుపాలెం మండల ప్రజలకు చిత్తూరు కేంద్రంగా పరిపాలనా సేవలు అందనున్నాయి.