News December 27, 2025
ఈనెల 28న పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి పర్యటన

ఈనెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైనవానిలంకలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 29, 2025
ప.గో: కారుమూరితో సహా 13 మందిపై కేసులు

మాజీ మంత్రి కారుమూరి వెంక నాగేశ్వరరావుతో సహా 13 మందిపై తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈనెల 25న తణుకు మండలం తేతలి వై జంక్షన్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ప్లెక్సీల ఏర్పాటుపై జరిగిన వివాదంలో పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వీరిపై 189(2), 329(2), 223(a) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు.
News December 29, 2025
ప.గో: ఓ వైపు బరులు.. మరోవైపు వినతులు

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ నేపథ్యంలో పలుచోట్ల కోడి పందేల నిర్వహణకు బరులను సిద్ధం చేస్తున్నారు. అధికారిక అనుమతులు రాకముందే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వీరవాసరం, ఆకివీడు, భీమవరం మండలాల్లో పందేలను నివారించాలంటూ స్థానికులు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తుండటం గమనార్హం. ఓవైపు పందేలకు సన్నాహాలు, మరోవైపు ప్రజల అభ్యంతరాలు కొనసాగుతున్నాయి.
News December 29, 2025
ప.గో: దర్శనానికి వేళాయె.. ఏడాదికోకసారి లభించే భాగ్యం

ద్వారకాతిరుమల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా గిరిప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. భక్తుల సౌకర్యార్థం 5 కిలోమీటర్ల మార్గంలో ఎండుగడ్డి, టెంట్లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గం: నుంచి ఏడాదికొకసారి లభించే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది.


