News April 24, 2024
ధర్మవరం: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీ వద్ద రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. మృతుడికి సుమారు 30 లేదా 35 సంవత్సరాలు ఉండచ్చని, నలుపు రంగు టీ షర్టు, ఆరెంజ్ కలర్ డ్రాయర్ ధరించి ఉన్నాడని హిందూపురం రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి బంధువులు ధర్మవరం రైల్వే పోలీస్ స్టేషన్కు వచ్చి కలవాలని వారు తెలిపారు.
Similar News
News March 10, 2026
బిల్డింగ్స్ అప్రూవల్ విషయంలో అవకతవకలు: ఏసీబీ డీఎస్పీ

అనంతపురం మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు వచ్చినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పలువురి ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. బిల్డింగ్స్ అప్రూవల్ విషయంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందన్నారు. ప్లానింగ్ రూల్స్, డాక్యుమెంట్స్ ప్రకారం బిల్డింగ్స్ కట్టారా, లేదా అని రేపు ఫీల్డ్ విచారణ చేపడతామన్నారు.
News March 10, 2026
గుత్తి కోట ఉత్సవాలు ఘనంగా జరపాలి: జేసీ

కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం గుత్తి కోట ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14, 15వ తేదీల్లో జరిగే ఈ గుత్తి కోట ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
News March 10, 2026
టెన్త్ పరీక్షల నిర్వహణపై శిక్షణ: డీఈవో

పదో తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, ఎంఈవోలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో టెన్త్ పరీక్షల నిర్వహణపై వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలను వారికి క్షుణ్ణంగా వివరించామన్నారు. టెన్త్ పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.


