News December 27, 2025
విద్యుత్ కష్టాలకు చెక్.. అయినవిల్లిలో భారీ సబ్స్టేషన్!

జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అయినవిల్లిలో నిర్మిస్తున్న 400 కేవీ సబ్స్టేషన్ మైలురాయిగా నిలుస్తుందని కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. లో-వోల్టేజ్ సమస్యలను అధిగమించి, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టును జిల్లాకే తలమానికంగా చేపడుతున్నట్లు తెలిపారు.
Similar News
News January 15, 2026
ఇరాన్ నో ఫ్లై జోన్.. ఇండిగో విమానం జస్ట్ మిస్!

ప్రభుత్వ వ్యతిరేక ఉద్రిక్తతల మధ్య గురువారం తెల్లవారుజామున ఇరాన్ తన గగనతలాన్ని అకస్మాత్తుగా మూసివేసింది. అయితే జార్జియా నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానం గగనతలం మూతపడటానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందే సురక్షితంగా బయటపడింది. ఆ ప్రాంతాన్ని దాటిన చివరి విదేశీ ప్యాసింజర్ విమానం ఇదే కావడం విశేషం. ఈ అకస్మాత్తు నిర్ణయంతో ఎయిరిండియా సహా పలు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లాయి.
News January 15, 2026
నిర్మల్: సీఎం పర్యటనపై ఆశలు

సీఎం ఈనెల 16న నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ముంగిట పర్యటన నిర్మల్ నుంచే ప్రారంభం కానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం రాకతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ పీఠాలన్నీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు, రాజకీయ వ్యూహరచనపై సీఎం దిశానిర్దేశం చేయనుండటంతో కేడర్లో ఉత్సాహం నెలకొంది.
News January 15, 2026
పార్వతీపురం: ఏనుగులు గుంపు ఎక్కడ ఉందంటే?

పార్వతీపురం మండలం సంగంవలస గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. రైతులు, గ్రామస్థులు ఎవరైనా పంట పొలాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదని చెప్పారు. అయితే తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించాలని అధికారులను గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.


