News December 27, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న మొత్తం 72,487 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,500 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు వచ్చింది. వరుస సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగింది.
Similar News
News January 12, 2026
కర్కాటకము వర్షిస్తే కాడిమోకు తడవదు

సాధారణంగా కర్కాటక కార్తెలో వర్షాలు చాలా వేగంగా, కుండపోతగా కాకుండా కేవలం తుంపర్లుగా లేదా చాలా తక్కువ సమయంలోనే కురిసి ఆగిపోతుంటాయి. ‘కాడి’ అంటే ఎడ్ల మెడపై వేసే చెక్క, ‘మోకు’ అంటే దానికి కట్టే బలమైన తాడు. కర్కాటక కార్తెలో వర్షం ఎంత తక్కువగా కురుస్తుందంటే, కనీసం పొలంలో పని చేసే ఎడ్ల కాడికి ఉన్న ఆ తాడు కూడా పూర్తిగా తడవనంత తక్కువగా ఉంటుందని దీని అర్థం. ఈ వర్షం వల్ల ప్రయోజనం ఉండదని భావం.
News January 12, 2026
ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎవరికిస్తారో తెలుసా?

ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది బ్యాంకులు ముందుగానే అర్హత నిర్ధారించి ఎంపిక చేసిన కస్టమర్లకు ఇస్తాయి. ఆదాయం, సిబిల్ స్కోర్, లావాదేవీల ఆధారంగా లోన్ మొత్తాన్ని ఫిక్స్ చేస్తాయి. సాధారణంగా మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి SMS లేదా ఈమెయిల్ పంపిస్తాయి. తక్కువ డాక్యుమెంట్స్తో లోన్ మంజూరు చేస్తాయి. అయితే అధిక వడ్డీ ఉండే అవకాశం ఉంది. దీంతో అవసరం ఉన్నప్పుడే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 12, 2026
చివరి 2 వన్డేలకు సుందర్ ఔట్?

టీమ్ ఇండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వడోదరలో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. కివీస్ ఇన్నింగ్స్లో 20వ ఓవర్ వేస్తున్న సమయంలో గాయపడటంతో వెంటనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మళ్లీ ఫీల్డింగ్కు రాలేదు. అనంతరం బ్యాటింగ్కు వచ్చినా ఇబ్బంది పడుతూ కనిపించారు. దీంతో చివరి 2 ODIలు ఆడకపోవచ్చని సమాచారం. దీనిపై BCCI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


