News December 27, 2025

ఏర్పేడు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. Ph.D ఇన్ ఫిజిక్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in/Project_Positions వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 03.

Similar News

News January 5, 2026

చిత్తూరు: లింగం మార్చి.. అమ్మాయి పక్క సీట్ బుక్ చేసి.!

image

ఇటీవల ఓ అమ్మాయి చిత్తూరు నుంచి బెంగళూరుకు RTC బస్సులో సీట్ బుక్ చేసుకుంది. ఆమె పక్క సీటులో అబ్బాయి ప్రత్యక్షం అయ్యాడు. ఆరా తీయగా మహిళ పేరుతో సీటు బుక్ చేసుకున్నట్లు తేలింది. సదరు అమ్మాయి తండ్రి కండక్టర్‌ను ప్రశ్నించగా నేనేమీ చేయలేనంటూ చేతులెత్తేశాడు. దీనిపై RTC అధికారులు విచారించారు. లింగ వివరాలు తప్పుగా ఉన్న టిక్కెట్లు చెల్లవని DPTO రాము స్పష్టం చేశారు. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా.?

News January 5, 2026

ఓయూ డిగ్రీ పరీక్షా తేదీలు వచ్చేశాయ్!

image

ఓయూ పరిధిలో జరిగే వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షా తేదీలను విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శశికాంత్ తెలిపారు. BA, BSW, BCom, BSc, BBA రెగ్యులర్ కోర్సుల మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలతో పాటు MA, MCom, MSc, MSW, MLIC, MJ& MC రెగ్యులర్ కోర్సుల 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

News January 5, 2026

కలుషిత నీరు.. 17కి చేరిన మరణాలు

image

ఇండోర్‌ భగీరథ్‌పురలో <<18729199>>కలుషిత నీరు<<>> తాగి మరణించిన వారి సంఖ్య 17కి పెరిగింది. తాజాగా ఓం ప్రకాశ్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మృతిచెందారు. ఇప్పటివరకు 398 మంది ఆస్పత్రిలో చేరగా 256 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం రేపు కోర్టులో నివేదిక ఇవ్వనుంది. మంచినీటి పైప్ లైన్‌లో మురుగునీరు కలవడమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం అక్కడి ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.