News December 27, 2025
హుస్నాబాద్: పుత్ర శోకం తట్టుకోలేక తండ్రి మృతి

వారం రోజుల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు మృతి చెందడంతో హుస్నాబాద్ మం. గాంధీనగర్లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్రావు(53) ఈనెల 20న గుండెపోటుతో మరణించారు. చేతికందిన కొడుకు దూరం కావడాన్ని తండ్రి చొక్కారావు(85) తట్టుకోలేకపోయారు. కొడుకు అంత్యక్రియల రోజే స్పృహతప్పి పడిపోయిన ఆయన, శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మరణించడంతో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి.
Similar News
News December 31, 2025
వికారాబాద్: ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతి జరగకుండా పోలీసులు బలగాలను మోహరించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నూతన సంవత్సర బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్తో రోడ్లపై డ్రైవింగ్ చేయవద్దన్నారు. ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తాయన్నారు.
News December 31, 2025
కృష్ణా: క్షేమంగా ఉంటేనే.. మీ ఇంట్లో ఆనందం.!

న్యూ ఇయర్ వేళ యువత అత్యుత్సాహానికి పోకుండా రూల్స్ పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ డ్రైవింగ్, సైలెన్సర్ లేని బైకులు, మద్యం సేవించి వాహనాలు నడపడం మీ ప్రాణాలకే కాదు, మీ కుటుంబానికీ తీరని లోటును మిగిల్చుతాయి. ఒక ఏడాది పోతే మరో ఏడాది వస్తుంది, కానీ ప్రాణం పోతే తిరిగి రాదని గుర్తుంచుకోవాలి. మీరు క్షేమంగా ఉంటేనే మీ ఇంట్లో ఆనందం ఉంటుంది. ఏ ప్రమాదం జరిగిన నష్టం వెనక్కిరాదని గుర్తుంచుకోవాలి.
News December 31, 2025
సంగారెడ్డి: న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

జిల్లా ప్రజలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నూతన సంవత్సర (2026) శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.


