News December 27, 2025
వామ్మో చిరుత.. భయాందోళనలో అటవీ గ్రామాలు

చిరుత సంచారంతో కోనరావుపేట మండలంలోని అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శివంగలపల్లి, మరిమడ్ల, వట్టిమల్ల గ్రామాల శివారుల్లో చిరుత ఆవులు, మేకలను చంపిన విషయం మరువకముందే తాజాగా వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో చిరుతపులి సంచారం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గొర్రెల కాపలాదారులు చూపించిన స్థలంలో చిరుతపులి కాలి ముద్రలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News December 28, 2025
రేపు కలెక్టరేట్లో రెవెన్యూ క్లీనిక్ ఏర్పాటు: కలెక్టర్

ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సోమవారం నుంచి రెవిన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఆదివారం తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల MROలు, గుంటూరు రెవిన్యూ డివిజనల్ అధికారి, తెనాలి సబ్ కలెక్టర్ గ్రామస్థాయి రికార్డులతో హాజరవుతారన్నారు. మండలాల వారీగా కౌంటర్లు ఉంటాయన్నారు.
News December 28, 2025
బంగ్లాదేశ్లో దాడులను అందరూ వ్యతిరేకించాలి: అమెరికా

బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా ఖండించింది. ఒక వర్గానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారనే ఆరోపణలతో దీపూ చంద్రదాస్ అనే యువకుడిని ఓ ముఠా హత్య చేసిన ఘటనపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణమైన ఘటనలను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లోని అన్ని వర్గాల భద్రత కోసం యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు.
News December 28, 2025
DRDO-DGREలో JRF పోస్టులు

<


