News December 27, 2025

గుత్తి వద్ద ఘోరం.. టిప్పర్ దూసుకెళ్లి 30 గొర్రెలు మృతి

image

గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి గుత్తి వైపునకు వెళ్తున్న ఇసుక టిప్పర్, రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని కాపరులు కన్నీరుమున్నీరయ్యారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Similar News

News February 6, 2026

తెలంగాణలో పవన్ ప్రచారం రద్దు

image

TG: రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దైంది. అనివార్య కారణాలతో ప్రచారం రద్దు చేసుకున్నట్టు జనసేన ప్రకటించింది. రేపు, ఎల్లుండి జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

News February 6, 2026

260 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>కొచ్చిన్<<>> షిప్‌యార్డ్ లిమిటెడ్‌(CSL)లో 260 వర్క్‌మెన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపు ఆఖరు తేదీ కాగా.. FEB 16వరకు పొడిగించారు. పోస్టును బట్టి టెన్త్, ITI, NTCతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.23,300 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in

News February 6, 2026

రాజన్న ఖజానాకు రూ.కోటి 72 లక్షలు పైగా ఆదాయం

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 72 లక్షల 76 వేల 469 ఆదాయం సమకూరింది. 13 రోజుల వ్యవధిలో భక్తులు భీమేశ్వరాలయంలో సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా రూ.1 కోటి 72 లక్షల 76 వేల 469 నగదు, 75 గ్రాముల 300 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల 800 గ్రాములు మిశ్రమ వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలిపారు.