News December 27, 2025
గుత్తి వద్ద ఘోరం.. టిప్పర్ దూసుకెళ్లి 30 గొర్రెలు మృతి

గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి గుత్తి వైపునకు వెళ్తున్న ఇసుక టిప్పర్, రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని కాపరులు కన్నీరుమున్నీరయ్యారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News February 6, 2026
తెలంగాణలో పవన్ ప్రచారం రద్దు

TG: రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దైంది. అనివార్య కారణాలతో ప్రచారం రద్దు చేసుకున్నట్టు జనసేన ప్రకటించింది. రేపు, ఎల్లుండి జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
News February 6, 2026
260 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<
News February 6, 2026
రాజన్న ఖజానాకు రూ.కోటి 72 లక్షలు పైగా ఆదాయం

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 72 లక్షల 76 వేల 469 ఆదాయం సమకూరింది. 13 రోజుల వ్యవధిలో భక్తులు భీమేశ్వరాలయంలో సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా రూ.1 కోటి 72 లక్షల 76 వేల 469 నగదు, 75 గ్రాముల 300 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల 800 గ్రాములు మిశ్రమ వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలిపారు.


