News December 27, 2025

ఒక్కరోజు ముందే పెన్షన్ పంపిణీ: కలెక్టర్

image

నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జనవరి 1 ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను ఒకరోజు ముందుగానే ఈనెల 31 పంపిణీ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సిబ్బందికి సూచించారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పెన్షన్ల పంపిణీ అవసరమయ్యే నగదును సిద్ధం చేసుకోవాలన్నారు.

Similar News

News January 4, 2026

బీజేపీ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలిగా సత్యవతి

image

బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నరసాపురానికి చెందిన గన్నాబత్తుల సత్యవతిని నియమించారు. పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించి పార్టీ ఈ బాధ్యతను అప్పగించింది. సత్యవతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అగ్ర నాయకత్వానికి, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలోని ప్రతి మహిళకు చేరేలా చూస్తానన్నారు.

News January 4, 2026

బీజేపీ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలిగా సత్యవతి

image

బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నరసాపురానికి చెందిన గన్నాబత్తుల సత్యవతిని నియమించారు. పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించి పార్టీ ఈ బాధ్యతను అప్పగించింది. సత్యవతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అగ్ర నాయకత్వానికి, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలోని ప్రతి మహిళకు చేరేలా చూస్తానన్నారు.

News January 4, 2026

ప.గో: అంబరాన్ని అంటిన సంబరాలు.. పల్లెల్లో సంక్రాంతి జోరు!

image

సంస్కతీ సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరంలో సంక్రాంతి సంబరాలను డిప్యూటీ స్పీకర్, కలెక్టర్ భోగి మంటలు వేసి ప్రారంభించారు. బొమ్మలకొలువు, రంగవల్లులు, గొబ్బమ్మలు, భోగిమంట, హరిదాసులు, కోలాటం, సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, కోలాట ప్రదర్శనలు తిలకించేందుకు వచ్చిన ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి.