News December 27, 2025

పెద్దపల్లి: ‘జీవో 252ను రద్దు చేయాలి’

image

జర్నలిస్టుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే జీవో 252ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (హెచ్‌ 143) ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో కోత విధిస్తే సహించేది లేదని, ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Similar News

News January 1, 2026

మెదక్ జిల్లాలో రూ.21.32 కోట్లు తాగేశారు

image

నూతన సంవత్సర వేడుకల వేళ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మెదక్ జిల్లాలో రూ. 21.32 కోట్ల విలువైన మద్యం తాగేశారు. అవును డిసెంబర్ 30, 31న రెండు రోజుల్లో చిన్నఘనపూర్ ఐఎంఎల్ డీపో నుంచి వైన్స్ వ్యాపారులు కొనుగోలు చేశారు. డిసెంబర్ నెలలో మొత్తం రూ.209 కోట్ల 50 లక్షలు మద్యం అమ్మకాలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల్లోనే రూ. 21 కోట్ల 32 లక్షల మద్యం లాగించేశారు.

News January 1, 2026

MSME టెక్నాలజీ సెంటర్, విశాఖపట్నంలో ఉద్యోగాలు

image

MSME టెక్నాలజీ సెంటర్, విశాఖపట్నంలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు JAN 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/B.Tech, డిప్లొమా, డిగ్రీ, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫ్యాకల్టీ, పర్చేజ్ ఇంఛార్జ్, హాస్టల్ వార్డెన్ పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ పోస్టులకు గరిష్ఠ వయసు 30ఏళ్లు. వెబ్‌సైట్: www.msmetcvizag.org

News January 1, 2026

తిరుమలలో నేటి రాత్రి నుంచే FREE దర్శనం?

image

లక్కీడిప్ టోకెన్లు ఉన్న భక్తులకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. సర్వ దర్శనం(టోకెన్లు లేకుండా ఫ్రీ ఎంట్రీ) నేటి రాత్రి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే TTD సర్వదర్శనం క్యూ లైన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆక్టోపస్ సర్కిల్ నుంచి లైన్ తీసుకోనున్నారు. రద్దీని బట్టి సాయంత్రం నుంచే టోకెన్లు లేని భక్తులను క్యూలోకి అనుమతించే అవకాశం ఉంది. CRO దగ్గర రూములు తీసుకోవచ్చు.