News April 24, 2024
భద్రాద్రి జిల్లాలో భానుడి భగభగలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 6 గంటల నుంచే ఎండ ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా అశ్వాపురం మండలంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా బూర్గంపహాడ్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Similar News
News April 22, 2025
ఖమ్మం: ఇంటర్ ఫలితాల్లో కృష్ణవేణి ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. సెకండియర్లో హాసిని 994, ప్రియాంబిక 993, సంతోశ్ 991, జ్యోత్స్న 994, నవ్యశ్రీ 988, ఫస్టియర్లో భువనకృతి 468, పవిత్ర 468, హర్షిత్ 467, ప్రహర్ష 437, కరుణశ్రీ 437 ఉత్తమ రిజల్ట్ సాధించారని డైరెక్టర్ జగదీశ్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల తోడ్పాటుతోనే ఈ ఫలితాలు సాధించగలిగామని డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వర రావు తెలిపారు.
News April 22, 2025
ఖమ్మం: ఇంటర్ రిజల్ట్స్.. విద్యార్థి అదృశ్యం.!

ఇంటర్మీడియట్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థి అదృశ్యమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. సుజాతనగర్ మండలానికి చెందిన సుశాంత్ ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఫలితాల అనంతరం సుశాంత్ కనబడటం లేదని తల్లిదండ్రులు తెలిపారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
News April 22, 2025
INTER RESULTS.. ఖమ్మంలో బాలికలదే హవా.!

ఇంటర్ ఫలితాల్లో.. ఖమ్మం జిల్లాలో అమ్మాయిలు ప్రతిభ చాటారు. ఫస్టియర్లో 17,837 మందికి 12,476 మంది విద్యార్థులు హాజరు కాగా, జనరల్లో బాలురు 64.51, బాలికలు 77.89 శాతం, ఒకేషనల్లో బాలురు 43.95, బాలికలు 76.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 16,919 మందికి 12,996 మంది హాజరు కాగా, జనరల్లో బాలురు 72.10, బాలికలు 83.13 శాతం, ఒకేషనల్లో బాలురు 52.60, బాలికలు 86.90 శాతం ఉత్తీర్ణత సాధించారు.