News December 27, 2025
GDK: మత్తుపై ఉక్కుపాదం.. గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్!

గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టామని, అనేక NDPS కేసులు నమోదుచేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు 2025 వార్షిక పత్రికా ప్రకటనలో రామగుండం CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు, తిరిగి నేరాలకు పాల్పడితే PD యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి రహిత లక్ష్యంగా ప్రత్యేక బృందాలతో చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
Similar News
News December 29, 2025
ఖమ్మం: చైనా మాంజా విక్రయించిన వినియోగించిన చర్యలు: సీపీ

పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను ఎవరైనా విక్రయించిన, వినియోగించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ చైనా మాంజా (సింథటిక్ దారం, గాజు పొడి) చాలా ప్రమాదకరమని చెప్పారు. ఈ దారాన్ని ఉపయోగించడం ద్వారా పక్షుల గొంతు, రెక్కలు తెగిపోవడం, మనుషులకు గాయాలవుతాయన్నారు. ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
News December 29, 2025
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్లో మీ పూజను <
News December 29, 2025
ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం

ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం రేపుతోంది. భూపాలపల్లి అడవి నుంచి ఆదివారం రాత్రి జాకారం వద్ద రోడ్డు దాటుతుండగా అంబులెన్స్ డ్రైవర్ గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పంది కుంట నర్సరీలోకి వెళ్లి కంచె దాటే క్రమంలో స్తంభం విరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అక్కడ పులి అడుగులను గుర్తించారు. భూపాల్ నగర్, జాకారం, శ్రీనగర్, రామచంద్రాపురం వాసులు అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు.


