News December 27, 2025

సహకార రంగ బలోపేతమే దేశాభివృద్ధికి మూలం: ఈటల

image

సహకార వ్యవస్థ బలోపేతంతోనే దేశం ముందుకు సాగుతుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. KNRలో జరిగిన డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పదవీ విరమణ సన్మాన సభలో పాల్గొన్నారు. రవీందర్ రావు డీసీసీబీ టర్నోవర్‌ను రూ.400 కోట్ల నుంచి రూ. 8 వేల కోట్లకు చేర్చడం స్ఫూర్తిదాయకమన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార రంగానికి పెద్దపీట వేస్తోందని, రాష్ట్రంలో అన్ని ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Similar News

News January 2, 2026

KNR: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ వారంలో వివిధ సొసైటీల ద్వారా 3,163 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని, మరో 2,616 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని, డిమాండ్‌ను బట్టి మరిన్ని నిల్వలు తెప్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.

News January 2, 2026

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు పతకాల పంట!

image

తెలంగాణ ప్రభుత్వ పోలీస్ సేవా పతకాల జాబితాలో కరీంనగర్ కమిషనరేట్ అధికారులు భారీగా చోటు దక్కించుకున్నారు. అడిషనల్ డీసీపీలు భీంరావు, వెంకట రమణ ‘మహోన్నత సేవా పతకాలకు’ ఎంపికవ్వగా, హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ సహా పలువురు ‘కఠిన సేవా పతకాలు’ సాధించారు. అంకితభావంతో పనిచేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు. ఈ అవార్డులు మరింతమందికి స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు.

News January 2, 2026

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు పతకాల పంట!

image

తెలంగాణ ప్రభుత్వ పోలీస్ సేవా పతకాల జాబితాలో కరీంనగర్ కమిషనరేట్ అధికారులు భారీగా చోటు దక్కించుకున్నారు. అడిషనల్ డీసీపీలు భీంరావు, వెంకట రమణ ‘మహోన్నత సేవా పతకాలకు’ ఎంపికవ్వగా, హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ సహా పలువురు ‘కఠిన సేవా పతకాలు’ సాధించారు. అంకితభావంతో పనిచేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు. ఈ అవార్డులు మరింతమందికి స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు.