News April 24, 2024
ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధం.. బీజేపీ నుంచి బహిష్కరణ

లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న కర్ణాటక బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్పను ఆ పార్టీ బహిష్కరించింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటన విడుదల చేసింది. తన కొడుక్కి పార్టీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రపై శివమొగ్గ నుంచి పోటీకి సిద్ధమయ్యారు.
Similar News
News March 20, 2026
గుడ్ న్యూస్: ధాన్యం సేకరణకు రూ.22,700 కోట్లు

TG: పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు GOVT రూ.22,700CRను రెడీ చేసింది. యాసంగిలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు అవసరమైన నిధులను పౌరసరఫరాల సంస్థ ఖాతాలో రుణం రూపేణా జమ చేయించింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాన్ని ఇప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రుణానికి గ్యారంటీ ఇస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో యాసంగిలో రైతుల నుంచి మార్క్ఫెడ్ ద్వారా 95L MT ధాన్యాన్ని సేకరించనున్నారు.
News March 20, 2026
కొత్త ఫోన్లలో ఆధార్ యాప్?

కొత్త మొబైల్స్లో డిఫాల్ట్గా ఆధార్ యాప్ను తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. యూజర్లు న్యూ మొబైల్ ఆన్ చేసినప్పుడే ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చని కేంద్రం చెబుతోంది. ఈ మేరకు స్మార్ట్ఫోన్ కంపెనీలకు ఈ ఏడాది జనవరిలో ఈ-మెయిల్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనను యాపిల్, శామ్సంగ్, గూగుల్ తిరస్కరించాయి.
News March 20, 2026
తెలంగాణ తలసరి ఆదాయం ₹4,18,931

* రెవెన్యూ వ్యయం: ₹2,34,406 కోట్లు
* మూలధన వ్యయం: ₹47,267 కోట్లు
* తలసరి ఆదాయం: ₹4,18,931 (జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.9% ఎక్కువ)
* రాష్ట్ర వృద్ధి రేటు: 10.2% (జాతీయ వృద్ధి రేటు కంటే 2.7% ఎక్కువ)
* GSDP: ₹17.82 లక్షల కోట్లు


