News December 28, 2025
జగిత్యాల: ‘కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారు’

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. సారంగాపూర్ (M) లక్ష్మీదేవిపల్లె మాజీ సర్పంచ్ లక్ష్మి తమ అనుచరులు 50 మంది, ధర్మానాయక్ తండా నుంచి చందు నాయక్తో పాటు 10 మంది కాంగ్రెస్ నాయకులు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Similar News
News December 31, 2025
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆశావహులు

మున్సిపల్ ఎన్నికలకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. జనవరి 10వ తేదీన ఓటరు తుది జాబితా విడుదల కానున్న నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలోని వివిధ పార్టీల నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఓటర్లకు చేరువ కావడంపై దృష్టి సారించారు. ప్రజల అవసరాలను గుర్తించి వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వార్డులలో నెలకొన్న సమస్యలపై అధికారులతో సమన్వయం అవుతూ పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.
News December 31, 2025
2025లో కష్టసుఖాల్లో తోడున్న వారికి ‘థాంక్స్’ చెప్పండి!

నేటితో 2025 ముగుస్తోంది. ఈ ఏడాది మనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను, కొన్ని గుణపాఠాలను ఇచ్చి ఉండొచ్చు. గెలుపులో నవ్వులు, కష్టాల్లో కన్నీళ్లు.. ఇలా ప్రతీ అనుభవం మనల్ని మరింత దృఢంగా మార్చింది. కష్టకాలంలో తోడుగా ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీని అస్సలు మర్చిపోకండి. వారికి థాంక్స్ చెప్పండి. డబ్బు, హోదా కంటే కుటుంబంతో గడిపే సమయమే ఎంతో విలువైనదని గుర్తుంచుకోండి. ఈ ఏడాది మీకు మంచి/ చెడు జరిగితే కామెంట్లో పంచుకోండి.
News December 31, 2025
నువ్వుల పంటలో ఆకు, కాయ తొలుచు పురుగు-నివారణ

ఈ పురుగు తొలి దశలో చిన్న చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు ఏర్పాటు చేసుకొని లోపలి నుంచి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగులు ఆకులనే కాకుండా మొగ్గలు, పువ్వులతో పాటు కాయలోని గింజలను కూడా తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటికి క్వినాల్ఫాస్ 20ml లేదా క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.


