News December 28, 2025
‘ముక్కోటి ఏకాదశి’ ఎందుకు స్పెషల్?

ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అందులో ముక్కోటి ఏకాదశి విశిష్టమైనది. ఈరోజే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠం చేరుకుంటారు. అందుకే దీనిని ‘ముక్కోటి ఏకాదశి’ అంటారు. ఈ ఒక్క ఏకాదశి నాడు చేసే ఉపవాసం మిగిలిన 23 ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు. అందుకే సామాన్య భక్తుల నుంచి మునుల వరకు అందరూ ఈ రోజును మోక్షాన్ని ప్రసాదించే గొప్ప పర్వదినంగా భావిస్తారు.
Similar News
News February 21, 2026
ఏఐ సమ్మిట్పై జగన్ నకిలీ సానుభూతి: లోకేశ్

AP: AI సమ్మిట్లో కాంగ్రెస్ నేతల నిరసనలను <<19201240>>ఖండించిన<<>> YCP చీఫ్ జగన్కు మంత్రి లోకేశ్ కౌంటరిచ్చారు. ‘2017లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు అంతరాయం కలిగించడానికి ఎయిర్పోర్టులో ధర్నా చేశారు. 2019లో గ్లోబల్ ఇన్వెస్టర్లతో విద్యుత్ ఒప్పందాలను, 2020లో అమరావతి-సింగపూర్ ఒప్పందాన్ని రద్దు చేశారు. 2025లో రుణాలు రాకుండా RBIకి లేఖ రాశారు. ఇప్పుడు AI సమ్మిట్పై నకిలీ సానుభూతి ప్రదర్శిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
News February 21, 2026
వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్

AP: లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు <<19203084>>వాసుదేవరెడ్డికి<<>> విజయవాడ ACB కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించనున్నారు. అంతకుముందు కోర్టులో విచారణ సందర్భంగా సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అప్రూవర్గా మారారని, అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉందని చెప్పారు.
News February 21, 2026
రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ రెండో వివాహం చేసుకున్నారు. ఐర్లాండ్కు చెందిన ప్రేయసి సోఫీ షైన్తో ఇవాళ ఏడడుగులు వేశారు. ఈ జంటకు అభిమానులు, తోటి క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


