News December 28, 2025
పాలమూరులో ‘సైబర్’ కలకలం.. పెరుగుతున్న కేసులు

సాంకేతికత ముసుగులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉమ్మడి పాలమూరులోని MBNR, NRPT, GDWL, NGKL, WNP పరధిలో 2025 ఏడాదిలో 3625 ఫిర్యాదులు రాగా, 454 కేసులు ఫైల్ అయ్యాయి. గతేడాది 3,003 ఫిర్యాదులు రాగా 236 కేసులు నమోదయ్యాయి. మహబూబ్నగర్లో అత్యధికంగా 1475 ఫిర్యాదులు రాగా 220 కేసులు నమోదయ్యాయి. నారాయణపేటలో అత్యల్పంగా 318 ఫిర్యాదులు రాగా 59 కేసులు నమోదయ్యాయి.
Similar News
News January 2, 2026
నిమిషంలోనే అంబులెన్స్ బయల్దేరింది: శ్రీకాకుళం DMHO

రణస్థలం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో 108 అంబులెన్స్ సేవలో సాంకేతిక సమస్య తప్ప మరే జాప్యం జరగలేదని DMHO డా.అనిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్ రాకలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని సాంకేతిక సమస్య వలన సమాచారం చేరడం జాప్యం జరిగిందని ఆమె వెల్లడించారు. 8.08 గంటలకు సమాచారం అందిన వెంటనే 8.09 నిమిషాలకు అంబులెన్స్ బయలుదేరి 2 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 5 నిమిషాల్లోనే చేరిందన్నారు.
News January 2, 2026
ఎన్నికల్లో పోటీ చేస్తాం: గురునాథరెడ్డి

వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం కచ్చితంగా పోటీ చేస్తుందని అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ప్రకటించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల నుంచి ప్రజలకు మేలు జరగలేదని విమర్శించారు. తాము నిరంతరం ప్రజలతోనే ఉండి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా గురునాథరెడ్డి 2009 ఎన్నిక, 2012 ఉప ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
News January 2, 2026
రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్కాస్ట్లో వివరించారు.


