News December 28, 2025
మిరపలో ఆకు ముడత తెగులు – యాజమాన్యం

పొలానికి ఆఖరి దుక్కిలో ఎకరాకు 200కిలోల వేప పిండి, తిరిగి బోదెలు ఎగవేయునపుడు 100 కిలోల వేప పిండి వేసుకోవాలి. నారు మొక్కలు నాటే 15 రోజుల ముందు పొలం చుట్టూ 2-3 వరుసల మొక్కజొన్న లేదా సజ్జ మొక్కలను పెంచాలి. నాటిన తర్వాత ఎకరాకు 10 పసుపు, 10 నీలం రంగు జిగురు అట్టలను పొలంలో ఏర్పాటు చేయాలి. నారు మొక్కలను నాటే ముందు ఇమిడాక్లోప్రిడ్ (లీటరు నీటికి 0.5 మి.లీ) మందు ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవాలి.
Similar News
News January 13, 2026
10 నిమిషాల్లో ఫుడ్ వస్తుంది.. మరి అంబులెన్స్?

TG: శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రధాన రహదారిపై కారు డివైడర్ను ఢీకొట్టడంతో 5నెలల గర్భిణి, ఆమె తల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడారు. విచారకరమైన విషయమేమిటంటే గంట వరకు అంబులెన్స్ రాలేదు. 10ని.ల్లో ఫుడ్ డెలివరీ అయ్యే నగరంలో గంట దాటినా అంబులెన్స్ రాకపోవడం ఆందోళనకరమని నెటిజన్లు మండిపడుతున్నారు. చివరకు ప్రైవేట్ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సమయానికి అంబులెన్స్ వస్తే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి.
News January 13, 2026
పప్పు గింజల పంటల్లో చిత్త పురుగులు.. నివారణ

మినుము, పెసర, అలసంద, కంది లాంటి పప్పు గింజల పైర్లు లేత దశలో(2-4 ఆకులు) ఉన్నప్పుడు చిత్త/పెంకు పురుగులు ఆశిస్తాయి. ఆకుల అడుగు భాగాల్లో చేరి రంధ్రాలు చేసి తినేస్తాయి. దీంతో మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వీటి నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 5గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. పంటలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి.
News January 13, 2026
కుక్కలపై ప్రేముంటే ఇళ్లకు తీసుకెళ్లండి: సుప్రీంకోర్టు

వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిలో ఎవరైనా గాయపడినా లేదా మరణించినా స్థానిక అధికారులు, కుక్కలకు ఆహారం పెట్టే వారే (Feeders) బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. వాటిపై ప్రేమ ఉన్నవారు ఇళ్లకు తీసుకెళ్లాలని, ప్రజలను భయపెట్టేలా రోడ్లపై వదలొద్దని జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం పేర్కొంది. బాధితులకు భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది.


