News December 28, 2025

టాప్‌లో మన తిరుపతి జిల్లా..!

image

2024లో సైబర్ నేరాలతో రూ.12.31 కోట్ల నష్టం జరగ్గా, అందులో రూ.2.30 కోట్లు రికవరీ చేసినట్లు SP సుబ్బరాయుడు తెలిపారు. 2025లో రూ.14.45 కోట్లకు గాను రూ.3.53 కోట్లు బాధితులకు అందజేశామన్నారు. NCPR ద్వారా ఈ రికవరీ సాధ్యమైందన్నారు. MOBILE HUNT యాప్ ద్వారా 2024లో 2003, 2025లో 2485 చోరీ మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ‘సైబర్ మిత్ర’తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఫోన్ల రికవరిలో జిల్లా టాప్‌లో ఉంది.

Similar News

News January 11, 2026

గుమ్మానికి ఎదురుగా మరో గుమ్మం ఉండవచ్చా?

image

ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మరో గుమ్మం ఉండటం శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇలా ఉంటే గదులు, హాల్స్‌ను క్రమబద్ధంగా వినియోగించుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. ‘దీనివల్ల ఇంటి లోపల శక్తి ప్రసరణ సాఫీగా జరిగి, కుటుంబీకుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇల్లు చూసేందుకు అందంగా, అమరికగా కనిపిస్తుంది. ఈ నియమాన్ని పాటిస్తే గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 11, 2026

మేడారంలో నో సిగ్నల్స్.. భక్తుల అసహనం

image

మేడారం మహా జాతరలో సిగ్నల్స్ లేక అవస్థలు తప్పడం లేదు. జాతర మొదలుకాక ముందే సిగ్నల్ అందక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో మొబైల్ సిగ్నల్‌పై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఫోన్లు కలవకపోవడం లేదని, ఇంటర్నెట్ పనిచేయడం లేదని వాపోతున్నారు. మరి కొద్ది రోజుల్లో జాతర ఉండగా ఇప్పుడే సిగ్నల్ కష్టాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.

News January 11, 2026

BREAKING: ATP ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

ట్రాక్టర్ బోల్తాపడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మద్దికేరలో ఆదివారం చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన బోయ కిష్టప్ప పత్తికొండకు ఇటుకల లోడుతో వెళ్తున్నాడు. కర్నూలులోని బురుజుల రోడ్డు సెల్ టవర్ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న అబ్దుల్ అజీజ్, శివ గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్సై హరిత తెలిపారు.