News December 28, 2025

సత్తుపల్లి – ఖమ్మం ప్రయాణం ఇక 34 నిమిషాలే: తుమ్మల

image

గ్రీన్‌ఫీల్డ్ రహదారి అందుబాటులోకి వస్తే సత్తుపల్లి నుంచి ఖమ్మంకు కేవలం 34 నిమిషాల్లోనే చేరుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జనవరి తర్వాత ఈ రహదారిని ప్రారంభిస్తామని గంగారంలో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. సత్తుపల్లి అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పటికే గోదావరి జలాలతో నియోజకవర్గంలోని చెరువులను నింపుతున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 29, 2025

పుస్తకాలు, పెన్నులతోనే శుభాకాంక్షలు తెలపండి: కలెక్టర్

image

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు బొకేలు, శాలువాలకు బదులుగా నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తీసుకురావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. 2026 నూతన ఏడాది వేళ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటించాలని సూచించారు. సేకరించిన ఈ విద్యా సామగ్రిని ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు అందజేస్తామన్నారు.

News December 29, 2025

ఖమ్మం: చైనా మాంజా విక్రయించిన వినియోగించిన చర్యలు: సీపీ

image

పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను ఎవరైనా విక్రయించిన, వినియోగించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ చైనా మాంజా (సింథటిక్ దారం, గాజు పొడి) చాలా ప్రమాదకరమని చెప్పారు. ఈ దారాన్ని ఉపయోగించడం ద్వారా పక్షుల గొంతు, రెక్కలు తెగిపోవడం, మనుషులకు గాయాలవుతాయన్నారు. ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

News December 29, 2025

జనవరి 7న ఖమ్మం జిల్లాకు కేటీఆర్‌ రాక

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 7న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లతో ఆయన భేటీ కానున్నారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా పార్టీ శ్రేణులు, నూతన సర్పంచ్‌లకు బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పర్యటనపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.