News December 28, 2025
అల్లూరి జిల్లాలో విషాదం.. తండ్రీకొడుకుల మృతి

అల్లూరి జిల్లా కూనవరం మండలం నర్సింగపేటలో ఆదివారం ప్రమాదం జరిగింది. కోడిపుంజుతో ఈత కొట్టించే ప్రయత్నంలో తండ్రీకొడుకులు సింహాద్రి అప్పారావు (42), జస్వంత్ (14) వ్యవసాయ నీటి గుంతలో పడి మృతి చెందారు. ఆశ్రమ పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Similar News
News January 10, 2026
ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ: నిర్మల్ ఎస్పీ

సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని చాలా మంది ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్తుంటారని.. ఈ అవకాశాన్ని దొంగలు ఆసరాగా చేసుకునే ప్రమాదం ఉందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ఊర్లకు వెళ్లే వారు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఊరికి వెళ్లే ముందు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ జరుగుతుందన్నారు.
News January 10, 2026
అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

ప్రపంచంలో ఎక్కువగా <<18798755>>చమురు<<>> ఉత్పత్తి చేసేది అమెరికానే. 2025లో రోజూ 1.34 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అమ్మింది. అయినా ఇతర దేశాల నుంచి ఆయిల్ ఎందుకు కొంటోంది? తమ దగ్గర ఉత్పత్తి అయ్యే లైట్ క్రూడ్ విలువ ఎక్కువ కావడమే కారణం. తేలికపాటి ముడి చమురును అధిక ధరకు అమ్మి, హెవీ క్రూడ్ను తక్కువకే కొంటోంది. హెవీ క్రూడ్ను శుద్ధి చేసే రిఫైనరీలు USలో ఉండటం మరో కారణం. 2025లో 20L బ్యారెళ్లను కొనుగోలు చేసింది.
News January 10, 2026
మెదక్: బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి: కలెక్టర్

బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం సందర్శించారు. అక్కడి పిల్లల సౌకర్యాలు, విద్య, పోషకాహారం వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న మెనూ, నిత్యావసర వస్తువులను పరిశీలించారు. బాలల వారి సంక్షేమం, ఉన్నత భవిష్యత్కు ఆసక్తిని, గమనించి వారి అభివృద్ధికి చేదోడుగా ఉండాలన్నారు.


