News December 28, 2025
Viral Photo: ఒకే ఫ్రేమ్లో రామ్ చరణ్, ధోనీ, సల్మాన్

మెగా పవర్స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, క్రికెట్ లెజెండ్ MS ధోనీ, నటుడు బాబీ డియోల్ ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫొటో SMలో వైరల్ అవుతోంది. నిన్న సల్మాన్ ఖాన్ 60వ బర్త్డే సెలబ్రేషన్స్కు చరణ్ హాజరైనట్లు తెలుస్తోంది. ఈ అరుదైన ఫొటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. కాగా ఈ ముగ్గురి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు వీరు కలిసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.
Similar News
News January 5, 2026
మీ గుమ్మానికి ‘స్వస్తిక్’ గుర్తు ఉందా?

స్వస్తిక్ సానుకూల శక్తి, శుభానికి సంకేతం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగి అదృష్టం వరిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. స్వస్తిక్ వేసిన చోట పరిశుభ్రత పాటించాలని, అక్కడ బూట్లు, చెప్పులు ఉంచకూడదని అంటున్నారు. ఇది ఎరుపు రంగులో ఉంటే అదృష్టమని, ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా నిరోధించవచ్చని సూచిస్తున్నారు. సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని నమ్మకం.
News January 5, 2026
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్లో 50 పోస్టులు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 50 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఎల్లుండి (JAN 7)వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, CA, ICWA, MBA, ME, ఎంటెక్, MSW, MA, PhD(హిందీ), LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అసెస్మెంట్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.bemlindia.in/
News January 5, 2026
నల్లమల సాగర్పై SCలో విచారణ

పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్ట్పై TG ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై SC CJI ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘AP వరద జలాలే వాడుకుంటామని చెబుతోంది. కేటాయింపులకు విరుద్ధంగా నీళ్లను వాడుకోవడం అసాధ్యం. దీనికి అనేక విషయాలు ముడిపడి ఉన్నాయి. తెలంగాణ అనేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ప్రాజెక్టులన్నీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి’ అని సింఘ్వీ పేర్కొన్నారు.


