News December 29, 2025
ఒంటిమిట్టలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: టీటీడీ

ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ఈ నెల 30న జరగబోయే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆదివారం TTD ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, చంటి బిడ్డల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనట్లు TTD AE అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఆరోజు భక్తులకు ప్రసాదం, అన్న ప్రసాదం అందుబాటులో ఉంటుందని TTD DEO ప్రశాంతి తెలియజేశారు.
Similar News
News January 4, 2026
కడప జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బోధనేతర సిబ్బంది అధ్యక్షుడు ఈయనే.!

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కడప జిల్లా భోధనేతర సిబ్బంది అధ్యక్షుడిగా హరిప్రసాద్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా శేఖర్, ట్రెజరర్గా రాజేశ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలోని బోధ నేతర సిబ్బంది సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
News January 4, 2026
జాతీయస్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలు.. ఏపీ టీం ఇదే.!

69వ జాతీయస్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలు జమ్మలమడుగులో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో ఏపీ టీం ఇదే.!
C. నవీన, R. మనస్వి, Y. నందిని, K. శ్యామలాదేవి, అవంతి, V. జాస్మిన్, P. లాస్య, M. అశ్వని, K. జెసికా, V. వందన, K. తేజస్వి, J. నాగూర్బి. కోచ్ ఎం. దేవిక, మేనేజర్గా బీవీ రమణయ్య వ్యవహరించనున్నారు. ఈ పోటీలకు జమ్మలమడుగులోని బాలికల ఇంటర్ కాలేజీ ఆతిథ్యం ఇవ్వనుంది.
>> ALL THE BEST TEAM AP
News January 4, 2026
జమ్మలమడుగుకు చేరుకుంటున్న వాలీబాల్ క్రీడాకారులు

రేపు జరగబోయే 69వ జాతీయస్థాయి అండర్-14 వాలీబాల్ క్రీడలకు 27 టీమ్స్ ఈరోజు జమ్మలమడుగుకు చేరుకున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. మిగతా టీంలు రేపు ఉదయానికి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటాయని తెలిపారు. ఈ క్రీడాకారులకు అందరికీ పూర్తిగా వసతి, భోజన ఏర్పాట్లు చేశామన్నారు. రేపు జరగబోయే పోటీలకు జమ్మలమడుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


