News December 29, 2025
పుష్పగిరిలో ఒకే పలకపై త్రిమూర్తుల అరుదైన కుడ్య శిల్పం

వల్లూరు(M) పుష్పగిరి క్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై ఒకే పలకపై త్రిమూర్తుల అరుదైన కుడ్య శిల్పం అద్భుతంగా ఉందని రచయిత చరిత్రకారుడు బొమ్మి శెట్టి రమేశ్ ఆదివారం తెలిపారు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సృష్టి పాలకుడు, పరమేశ్వరుడు సృష్టి లయ కారకుడన్నారు. త్రిమూర్తులు ఒకే పరబ్రహ్మం మూడు రూపాలు అని చెప్పారు.
Similar News
News December 31, 2025
కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా వేగవంతమైన శిక్షలు: జిల్లా ఎస్పీ

కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా వేగవంతమైన దర్యాప్తుతో త్వరితగతిన శిక్షలు సాధ్యమయ్యాయని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. 11 తీవ్రమైన నేరాల కేసులలో 16 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్షలు పడినట్లు తెలిపారు. మరో 3 కేసుల్లో 4 మంది నిందితులకు 10 సంవత్సరాలకు పైగా శిక్షలు పడ్డాయన్నారు. జిల్లాలో 2023లో 304 కేసుల్లో, 2024లో 304 కేసుల్లో, 2025లో 314 కేసుల్లో శిక్షలు విధించబడ్డాయన్నారు.
News December 31, 2025
PGRSలో 9,300 సమస్యలు పరిష్కారం: కడప ఎస్పీ

కడప జిల్లాలో 2025 ఏడాదికి ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక(PGRS)లో 9,704 పిర్యాదులు వచ్చాయని.. వాటిలో 9,300 ఫిర్యాదులు నిర్ణీత గడువులోపు పరిష్కరించినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. ప్రజాసేవ, సమాజంలో భాగస్వామ్యం, చట్టం అమలులో ఉన్నత ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందినట్లు తెలిపారు. 2026లో మరింత అంకితభావంతో ప్రజలకు ఉన్నతమైన సేవలు అందిస్తామని తెలిపారు.
News December 30, 2025
2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (1/4)

ఈ ఏడాది జరిగిన నేరాల వివరాలను ఎస్పీ నచికేత్ వివరించారు.
✎ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 5406 మందిపై 5379 కేసులు నమోదు
✎ SC, ST అట్రాసిటీ కేసులు గత ఏడాది 78, ఈ ఏడాది 71 నమోదు
✎ ప్రాపర్టీ నేరాల కేసులు 575 నమోదు. వాటిలో 330 కేసుల ఛేదింపు. పోగొట్టుకున్న సొత్తు విలువ రూ.8.59 కోట్లు.. రికవరి రూ.4.15 కోట్లు
✎ డ్రంకెన్ డ్రైవ్లో 1713 కేసులు నమోదు. 1,251 కేసుల్లో జరిమానా, 49 మందికి జైలు శిక్ష.
<<18714494>>CONTINUE<<>>


