News December 29, 2025

2029లోనూ మోదీ ప్రభుత్వమే: అమిత్ షా

image

ప్రజాసేవ, అభివృద్ధి మంత్రాన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేవని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. అందుకే ప్రతిసారి ఓడిపోతున్నాయని చెప్పారు. ‘2029లోనూ మోదీ నాయకత్వంలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. BJP సూత్రాలతో ప్రజలు కనెక్ట్ కావడమే ఇందుకు కారణం. అయోధ్య, సర్జికల్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 రద్దు.. అన్నింటినీ ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. జనం మద్దతిచ్చే వాటిని వ్యతిరేకిస్తే ఓట్లు ఎలా పడతాయి’ అని ప్రశ్నించారు.

Similar News

News February 4, 2026

ఆత్మవిశ్వాసానికి సంకేతం ‘మణిపూరక చక్రం’

image

బొడ్డు భాగంలో ఉండే ఈ చక్రం ఆత్మవిశ్వాసానికి సంకేతం. ఇది సమతుల్యంగా ఉంటే నిర్ణయాలు తీసుకునే శక్తి, నాయకత్వ లక్షణాలు, మంచి జీర్ణక్రియ కలుగుతాయి. ఇది అస్థిరంగా మారితే అజీర్తి, షుగర్, ఎదుటివారిపై అధికారం చెలాయించే స్వభావం పెరుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘రం’ మంత్రాన్ని ధ్యానించాలి. పసుపు రంగు దుస్తులు ధరించడం, సూర్యరశ్మిలో గడపడం, యోగ, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఈ చక్రాన్ని మేల్కొల్పవచ్చు.

News February 4, 2026

ఆయిల్ పామ్ సాగులో ఇవి కీలకం

image

ఆయిల్ పామ్ సాగుకు నీటి సదుపాయం కీలకం. 2 అంగుళాల బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా రోజూ 2,3 గంటలు.. వేసవిలో 4,5 గంటలు నీరివ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు తప్పక వేయాలి. పంట దిగుబడికి ఫలదీకరణం కీలకం. అందుకే మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు వచ్చే పొత్తులను తీసేయాలి. దీని వల్ల మొక్క మాను బాగా వృద్ధిచెందుతుంది. భవిష్యత్తులో గెలలు నిండుగా వచ్చి బరువు పెరుగుతాయి.

News February 4, 2026

‘నాన్‌వెజ్‌’ విక్రయాలపై హైకోర్టు కీలక సూచనలు

image

TG: మాంసం, నాన్‌వెజ్‌ పదార్థాల విక్రయంపై సర్కారుకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. గుడులు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల నుంచి 100 మీటర్లలోపు మాంసం, నాన్‌వెజ్‌ పదార్థాలను అమ్మకుండా ఓ విధానం రూపొందించాలని సూచించింది. భక్తుల మనోభావాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలు తయారు చేయాలంది. మాంసం దుకాణాల ప్రారంభానికి పోలీస్‌ స్టేషన్‌ నుంచి NOC పొందాలనే నిబంధన చేర్చాలని తెలిపింది.