News April 24, 2024

మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తే కఠిన చర్యలు: విద్యాశాఖ

image

AP: టెన్త్ విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచేందుకే ర్యాంకుల సంస్కృతికి ముగింపు పలికినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. స్కూళ్లు మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి పర్సనల్ ఎడ్యుకేషన్ నంబర్(PEN) కేటాయించామని చెప్పారు. దీనిద్వారా విద్యార్థి దేశంలోని ఏ ప్రాంతానికైనా సులభంగా పాఠశాలను మారవచ్చన్నారు.

Similar News

News April 17, 2026

‘దుష్టచతుష్టయం’ అంటే ఎవరు?

image

ఎవరైనా నలుగురు కలిసి తప్పుడు కార్యాలు చేస్తున్నప్పుడు వారిని ‘దుష్టచతుష్టయం’తో పోలుస్తాం. రాజకీయాల్లో ఎక్కువగా ఈ పదాన్ని వాడుతుంటారు. మహాభారతంలోని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడిని కలిపి దుష్టచతుష్టయం అని మహా కవి తిక్కన ఉద్యోగ పర్వంలో సంబోధించారు. ‘మాయా బజార్’ సినిమా ద్వారా ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మీ జీవితంలో ఇలా దుష్టచతుష్టయం ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>

News April 17, 2026

బెస్ట్ కవర్ డ్రైవ్ కోహ్లీదే: సెహ్వాగ్

image

IPLలో వివిధ షాట్లను ఎవరు ఫర్‌ఫెక్ట్‌గా ఆడతారో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. కవర్ డ్రైవ్- కోహ్లీ, పుల్ షాట్- వైభవ్, ఫ్లిక్ షాట్- ఆయుష్ మాత్రే, స్కూప్ షాట్, స్వీప్ షాట్- సూర్య, స్ట్రెయిట్ డ్రైవ్- సంజూ, ర్యాంప్ షాట్- డివిలియర్స్, రివర్స్ స్వీప్- ప్రభ్‌సిమ్రన్, కట్ షాట్- ప్రియాంశ్, ఇన్‌సైడ్ ఔట్- పడిక్కల్. ఈ లిస్టులో ఎవరైనా మిస్సయ్యారా? కామెంట్ చేయండి.

News April 17, 2026

మోదీని ‘జాదూగర్’ అన్న రాహుల్.. క్షమాపణకు బీజేపీ డిమాండ్

image

మహిళా రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా PM మోదీని జాదూగర్(మెజీషియన్) అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్లతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఆయన ప్రధానిని అవమానిస్తున్నారంటూ BJP సభ్యులు మండిపడ్డారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 140Cr ప్రజలకు ప్రతినిధి అయిన మోదీని ఎగతాళి చేయడం సరికాదని రాజ్‌నాథ్ విమర్శించారు. ఈ క్రమంలో LoP వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు.