News April 24, 2024
అనంత : 598 మార్కులతో సత్తా చాటిన టి.ప్రణతి

అనంతపురం నగరానికి చెందిన టి.ప్రణతి సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాలలో 598 మార్కులతో సత్తా చాటి రాష్ట్ర టాపర్లలో ఒకరిగా నిలిచింది. ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగడమే తన లక్ష్యమన్నారు. ఆమెను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చుట్టాలు అభినందించారు.
Similar News
News March 24, 2026
ఆదర్శ నాయుడి హత్య కేసు.. ఐదుగురి అరెస్ట్

రెండు రోజుల కిందట అనంతపురం RTC బస్టాండ్ వద్ద జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు 3-టౌన్ CI రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. బన్నీ, కరుణాకర్రెడ్డి, రాజేశ్, అస్మిత్ చౌదరి, బండి ఉజ్జనప్పను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఆకుల వంశీ కృష్ణపై పాత కక్షతో దాడి చేయాలని యోచించిన నిందితులు, అతనితోపాటు ఉన్న ఆదర్శ నాయుడిపై తీవ్రంగా దాడి చేయగా అతను మృతి చెందారు.
News March 24, 2026
రోడ్డు భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్

రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని ఎస్పీ జగదీశ్తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతకోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
News March 24, 2026
ఆర్డీటీ పోరాటం సఫలం: మాజీ ఎంపీ తలారి రంగయ్య

ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కోసం చేసిన పోరాటం ఫలించిందని మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గుంజి తాండ నుంచి చేపట్టిన పాదయాత్ర, పోస్టు కార్డుల ఉద్యమం ద్వారా సంస్థకు న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేలా శుభవార్త రావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్డీటీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


