News December 29, 2025
పెద్దపల్లి: 8 పాఠశాలలకు జిల్లా స్థాయి అవార్డులు

పెద్దపల్లి జిల్లాలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 పాఠశాలలకు జిల్లా స్థాయి స్వచ్ఛ పాఠశాల అవార్డులు అందజేశారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష అవార్డులు, ప్రశంస పత్రాలు పంపిణీ చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, హైజిన్, మిషన్ లైఫ్ అంశాలను లెక్కించి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఆరోగ్యం, పర్యావరణ అవగాహన పెరిగిందని పేర్కొన్నారు.
Similar News
News February 19, 2026
రేపు ఢిల్లీ ఏఐ సమ్మిట్కు CM చంద్రబాబు

AP: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరుగుతున్న ఏఐ సమ్మిట్లో పాల్గొంటారు. అక్కడికి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. IBM, UNICC, NIELIT సంస్థలతో ఈ ఒప్పందాలు జరగనున్నాయి. UK మంత్రి, ఆరామ్కో ఇండియా, అడోబ్ ఇండియా సీఈఓలతో చంద్రబాబు సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగి అమరావతికి చేరుకుంటారు.
News February 19, 2026
నిర్మల్ జిల్లాలో మరాఠాల ముద్ర!

శివాజీ నేరుగా ఇటు రాకున్నా మరాఠా బలగాలు గోదావరి తీరం వెంట విస్తృతంగా సంచరించాయి. నాటి సైనిక కదలికల వల్లే నిర్మల్ పరిసరాలతో పాటు ముధోల్, బాసర, లోకేశ్వరం ప్రాంతాల్లో ‘ఆరె మరాఠా’ సమాజం పెద్దఎత్తున స్థిరపడింది. కట్టడాల ఆనవాళ్లు లేకున్నా శివాజీ స్ఫూర్తి, మరాఠా సంస్కృతి ఇక్కడి చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి. వారు నేటికీ జయంతులు ఘనంగా జరుపుతూ ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు.
News February 19, 2026
పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు: సీపీ

ఖమ్మం జిల్లాలోని 66 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు సెక్షన్ 163 (BNSS యాక్ట్) అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. పరీక్షల సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని ఆదేశించారు. ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


