News December 29, 2025

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: ములుగు కలెక్టర్

image

ములుగు జిల్లా రైతులు యూరియా కోసం ఆందోళన పడవద్దని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ దివాకర్ తెలిపారు. ఈ సీజన్లో 17,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా.. ప్రస్తుతం 972 మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించినట్లు తెలిపారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 9945 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశామని వెల్లడించారు. అవసరమైనన్ని కాంప్లెక్స్ ఎరువులను కూడా తెప్పించామని స్పష్టం చేశారు.

Similar News

News January 2, 2026

కామారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీసీసీ అధ్యక్షుడు

image

కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ పటిష్టతపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు.

News January 2, 2026

శింగనమలకు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్, ప్రియాంక?

image

ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఫిబ్రవరి 2న శింగనమల నియోజకవర్గంలోని బండపల్లికి కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నట్లు సమాచారం. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని బండ్లపల్లిలోనే ప్రారంభించారు. తర్వాత దేశవ్యాప్తంగా అమలైంది.

News January 2, 2026

NZB: అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తాం: కవిత

image

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉందన్నారు. మొదటి నుంచి నేను స్వతంత్రంగా పని చేశానని, BRSపై మనసు విరిగిందన్నారు. KCR పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు.