News December 29, 2025
సిరిసిల్ల జిల్లాలో రెండు మునిసిపాలిటీలు.. వివరాలివే!

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో 2011 జనాభా గణాంకాల ప్రకారం 1,35,711 జనాభా ఉండగా, ఇందులో 12,891 మంది ఎస్సీలు, 1,557 మంది ఎస్టీలు ఉన్నారు. 2020 మునిసిపల్ ఎన్నికల రికార్డుల ప్రకారం రెండు మున్సిపాలిటీలో కలిపి 69 వార్డులలో 1,10,625 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో యువ ఓటర్ల నమోదు జరిగిన నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను జనవరి 10వ తేదీన ప్రకటించనున్నారు
Similar News
News January 10, 2026
కర్నూలు పోలీసుల డబ్బుల బేరం.. రంగంలోకి DGP!

KNLలోని ఓ PSలో పనిచేస్తున్న నలుగురు క్రైం పార్టీ సిబ్బంది అవినీతి చర్చనీయాంశమైంది. ఇటీవల ఓ చోరీ కేసులో హైదరాబాద్కు చెందిన వ్యాపారిని కర్నూలుకు తీసుకొచ్చారు. అయితే మార్గమధ్యంలో శివరాంపల్లి వద్ద అతనితో బేరం కుదుర్చుకొని డబ్బులు ఫోన్ పే చేయించుకున్నారు. ఈ విషయంపై ఆ వ్యాపారి తెలంగాణ ప్రజాప్రతినిధుల ద్వారా AP DGPతో మాట్లాడించారు. చర్యలకు జిల్లా ఉన్నతాధికారులను DGP ఆదేశించినట్లు తెలుస్తోంది.
News January 10, 2026
వరంగల్: 13 మంది బాల కార్మికులకు విముక్తి

ఆపరేషన్ స్మైల్ 12వ విడతలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో AHTU ఆధ్వర్యంలో ఇద్దరు బాలికలతో సహా 13 మంది బాల కార్మికులకు పని నుంచి విముక్తి కలిగించారు. ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ పరిధిలో ఐదుగురు, వెస్ట్ జోన్ పరిధిలో ఐదుగురు, ఈస్ట్ జోన్ పరిధిలో ముగ్గురు బాలలను రక్షించినట్లుగా అధికారులు వెల్లడించారు.
News January 10, 2026
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నామినేటెడ్పై ఆశలు

ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు ముమ్మరమైంది. పండుగలోపే కీలక కార్పొరేషన్లు, కమిటీల నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగింది. DCCB, DCMS వంటి సహకార సంస్థల పాలకవర్గాల నియామకంపై స్పష్టత రావడంతో ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, కాంగ్రెస్ పట్ల విధేయత ప్రాతిపదికన తుది జాబితా సిద్ధమవుతున్నట్లు సమాచారం.


