News December 29, 2025

మేడ్చల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు!

image

మేడ్చల్ జిల్లాలో ఎన్నికల నగారా మోగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికలకు EC సమాయత్తం అవుతోంది. GHMC విలీనం అనంతరం మేడ్చల్ జిల్లాలో మిగిలిన 3 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక జాబితా వెల్లడైంది. అలియాబాద్‌లో 20 వార్డుల్లో జానాభా 18,876, మూడుచింతలపల్లి 24 వార్డుల్లో 24,214, ఎల్లంపేట 24 వార్డులకు 25,823గా జనాభా సంఖ్య ఉంది.

Similar News

News December 30, 2025

నెల్లూరు జిల్లాలో డివిజన్లు ఇలా..!

image

➤నెల్లూరు(12): సైదాపురం, రాపూరు, పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు, టీపీ గూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చి, నెల్లూరు సిటీ, రూరల్
➤కావలి(12): వీకే పాడు, కొండాపురం, వింజమూరు, కొడవలూరు, విడవలూరు, దుత్తలూరు, కలిగిరి, జలదంకి, దగదర్తి, అల్లూరు, బోగోలు, కావలి
➤ఆత్మకూరు(9): కలువాయి, చేజర్ల, సంగం, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, ASపేట, ఉదయగిరి, సీతారామపురం
➤గూడూరు(3): కోట, చిల్లకూరు, గూడూరు

News December 30, 2025

కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

image

AP: లైఫ్ ట్యాక్స్ వర్తించే వాహనాలపై ఆ పన్నులో 10% చొప్పున “రోడ్ సేఫ్టీ సెస్” వసూలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ చేసి రోడ్ల మెరుగుదల, భద్రతా చర్యలకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ సెస్ ద్వారా సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. GST తగ్గింపుతో వాహనాల రేట్లు తగ్గాయని, వాహనదారులకు ఈ సెస్ భారం కాబోదని తెలిపింది.

News December 30, 2025

MBNR: 200 ఉద్యోగాలు.. నేడే చివరి అవకాశం.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 3 ప్రైవేట్ సంస్థలు 200 ఉద్యోగాలు ఉన్నాయని దరఖాస్తులను స్వీకరిస్తున్నామని ఉపాధి కల్పనా అధికారి మైత్రి ప్రియ తెలిపారు. ఈరోజు ఉ.10.30 నుంచి 2 గంటల వరకు మాత్రమే అవకాశం ఉందన్నారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోమన్నారు. రూ.10 నుంచి 20 వేల వేతనాలు ఉంటాయన్నారు. 9948568830, 8919380410 సంప్రదించాలన్నారు.